E-Paper
Advertisement

Suicide Attempt : గోదావరిలో దూకిన నవ జంట.. వరుడు ఒడ్డుకి.. వధువు గల్లంతు..

Suicide Attempt : గోదావరిలో దూకిన నవ జంట.. వరుడు ఒడ్డుకి.. వధువు గల్లంతు..
Advertisement
Local news andhra pradesh

Suicide Attempt in AP(Local news andhra Pradesh):

డిసెంబర్ 15న ఆ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. మంగళవారం రాత్రి సరదాగా బైక్ పై బయటకు వెళ్లారు. ఇంతలో ఆ జంట గోదావరిలోకి దూకిందనే వార్త కుటుంబ సభ్యులకు చేరింది. ఈ ఘటనలో వరుడు ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు. ఆ నవవధువు మాత్రంలో గోదావరిలో కొట్టుకుపోయింది. ఈ ఘటన వెనుక మిస్టరీ మాత్రం ఇంకా వీడలేదు.

ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామానికి చెందిన శివరామకృష్ణకు వడలి గ్రామానికి చెందిన కోరాడ సత్యవాణి(19)తో డిసెంబర్ 15న వివాహం జరిగింది. వీరు మంగళవారం రాత్రి పెనుగొండ మండలం సిద్ధాంతం వంతెనపై నుంచి గోదావరిలోకి దూకేశారు. వధువు కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సినిమాకి వెళ్తున్నామని ఆ జంట బైక్ పై బయటకు వెళ్లింది. సిద్ధాంతం వంతెన వద్ద బైక్, వరుడు ఈదుకొచ్చిన చోట వధువు చెప్పులు ఉన్నాయి.

Advertisement

జరిగిన ఘటనపై వరుడు.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. పోలీసుల సాయంతో గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. తణుకులోని ప్రైవేట్ ఆసుపత్రి ఉన్న శివరామకృష్ణను పోలీసుల అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. వరుడిపై వధువు బంధువులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. వధువు గల్లుంతుపై అదృశ్యం కేసు నమోదు చేశామని పెనుగొండ ఎస్ఐ రమేష్‌ తెలిపారు.

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×