E-Paper
Advertisement

Suicide Attempt : గోదావరిలో దూకిన నవ జంట.. వరుడు ఒడ్డుకి.. వధువు గల్లంతు..

Suicide Attempt : గోదావరిలో దూకిన నవ జంట.. వరుడు ఒడ్డుకి.. వధువు గల్లంతు..
Advertisement
Local news andhra pradesh

Suicide Attempt in AP(Local news andhra Pradesh):

డిసెంబర్ 15న ఆ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. మంగళవారం రాత్రి సరదాగా బైక్ పై బయటకు వెళ్లారు. ఇంతలో ఆ జంట గోదావరిలోకి దూకిందనే వార్త కుటుంబ సభ్యులకు చేరింది. ఈ ఘటనలో వరుడు ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు. ఆ నవవధువు మాత్రంలో గోదావరిలో కొట్టుకుపోయింది. ఈ ఘటన వెనుక మిస్టరీ మాత్రం ఇంకా వీడలేదు.

ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామానికి చెందిన శివరామకృష్ణకు వడలి గ్రామానికి చెందిన కోరాడ సత్యవాణి(19)తో డిసెంబర్ 15న వివాహం జరిగింది. వీరు మంగళవారం రాత్రి పెనుగొండ మండలం సిద్ధాంతం వంతెనపై నుంచి గోదావరిలోకి దూకేశారు. వధువు కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సినిమాకి వెళ్తున్నామని ఆ జంట బైక్ పై బయటకు వెళ్లింది. సిద్ధాంతం వంతెన వద్ద బైక్, వరుడు ఈదుకొచ్చిన చోట వధువు చెప్పులు ఉన్నాయి.

Advertisement

జరిగిన ఘటనపై వరుడు.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. పోలీసుల సాయంతో గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. తణుకులోని ప్రైవేట్ ఆసుపత్రి ఉన్న శివరామకృష్ణను పోలీసుల అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. వరుడిపై వధువు బంధువులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. వధువు గల్లుంతుపై అదృశ్యం కేసు నమోదు చేశామని పెనుగొండ ఎస్ఐ రమేష్‌ తెలిపారు.

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×