E-Paper
Advertisement

Chhattisgarh: ఈ నెల 22న బంద్ కు నక్సల్స్ పిలుపు ..ఛత్తీస్ గఢ్, తెలంగాణ సరిహద్దులో హైఅలెర్ట్..

Chhattisgarh: ఈ నెల 22న బంద్ కు నక్సల్స్ పిలుపు ..ఛత్తీస్ గఢ్, తెలంగాణ సరిహద్దులో హైఅలెర్ట్..

Chhattisgarh: ఛత్తీస్ గడ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నక్సలైట్లు నిత్యం హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. ఈ నెల 22న నక్సలైట్లు భారత్ బంద్ ప్రకటించారు. సుక్మా జిల్లా నాగారం, కొత్తపల్లి ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పక్క సమాచారం అందడంతో అక్కడకు పోలీసులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య భీకర ఎదురకాల్పుల జరిగాయి. ఈ ఎదురు కాల్పులలో చాలామంది మావోయిస్టులు మృతి చెందారు.

మావోయిస్టులు బుధవారం రాత్రి 7.30 గంటలకు 30వ జాతీయ రహదారిపై ఒక బస్సు, రెండు వాహనాలకు నిప్పు అంటించారు. ఆ తర్వాత జాగర్ గుండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కమర్ గూడలో పికప్ వాహనానికి నిప్పు అంటించారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని అందరు క్షేమంగా ఉన్నట్టు రాష్ట్రప్రభుత్వం వెల్లడిచింది. ఈ ఘటనతో రహదారి మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది.స్పెషల్ పోలీసులు ఈ ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

భద్రతా సిబ్బంది మావోయిస్ట్‌లు కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. రెండేళ్ల క్రితం బంద్ ప్రకటించినప్పుడు కూడా ఏడు వాహనాలకు నిప్పు పెట్టి దగ్ధం చేశారని స్థానిక ప్రజలు తెలిపారు. మావోయిస్టలు వారి ఉనికిని తెలుపేందుకే ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ నెల 22న ప్రకటించిన బంద్‌ను విజయవంతం చేయాలని కరపత్రాలు , పోస్టర్లు అంటించి, భారత్ బంద్ కి ప్రతిఒక్కరు సహాకరించాలని , ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అడవిలోకి వెళ్లిపోయారని స్థానికులంటున్నారు. దీంతొ పోలీసులు ఛత్తీస్‌గడ్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు.

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×