BigTV English
Advertisement

NTR RS 100 Coin : ఎన్టీఆర్ స్మారక రూ. 100 నాణెం .. విడుదల చేసిన రాష్ట్రపతి

NTR RS 100 Coin : ఎన్టీఆర్ స్మారక రూ. 100 నాణెం .. విడుదల చేసిన రాష్ట్రపతి
NTR 100 rupee coin inauguration

NTR 100 rupee coin inauguration(AP news today telugu) :

మహానటుడు, దివంగత సీఎం నందమూరి తారక రామారావు శతజయంతి వేళ కేంద్రం ముద్రించిన రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్‌ సాంస్కృతిక కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా హాజరయ్యారు.


భారతీయ సినిమా చరిత్రలో ఎన్టీఆర్‌ ఎంతో ప్రత్యేకమని రాష్ట్రపతి ముర్ము అన్నారు. కృష్ణుడు, రాముడు లాంటి పాత్రల్లో ఎన్టీఆర్‌ నటన అద్భుతమని ప్రశంసించారు. రాజకీయాల్లోనూ ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారని కొనియాడారు. సామాజిక న్యాయం కోసం కృషి చేశారని గుర్తు చేశారు.

ఎన్టీఆర్‌ అంటే తెలియని వారు ఉండరని పురందేశ్వరి తెలిపారు. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించిన నాయకుడు ఎన్టీఆర్‌ అని గుర్తు చేశారు. తిరుపతిలో మహిళా వర్సిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించారు.ఎన్టీఆర్ అన్ని తరాలకు ఆదర్శ హీరో అని పురందేశ్వరి చెప్పారు.


కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1923 మే 28న ఎన్టీఆర్‌ జన్మించారు. స్వయం కృషితో ఎదిగారు. సినీ, రాజకీయ రంగాలపై చెరగని ముద్రవేశారు. ఆ మహనీయుడి సేవలకు గుర్తుగా శత జయంతి వేళ కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక రూ.100 నాణేన్ని ముద్రించింది. హైదరాబాద్‌ మింట్‌ కాంపౌండ్‌లో ఈ స్మారక నాణేన్ని తయారు చేశారు. ఈ విషయంపై మార్చి 20న గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది.

44 మిల్లీమీటర్ల చుట్టుకొలతతో ఉండే ఈ నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్‌, 5 శాతం జింక్‌తో తయారు చేశారు. ఎన్టీఆర్‌ జీవిత విశేషాలపై 20 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిల్మ్ ను రాష్ట్రపతి ఎదుట ప్రదర్శించారు. ఆ తర్వాత రాష్ట్రపతి ముర్ము ప్రత్యేక నాణేన్ని విడుదల చేశారు.

Tags

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×