E-Paper
Advertisement

AP High Court: ఏపీ హైకోర్టుకు ఇద్దరు శాశ్వత న్యాయమూర్తులు.. ప్రమాణస్వీకారం

AP High Court: ఏపీ హైకోర్టుకు ఇద్దరు శాశ్వత న్యాయమూర్తులు.. ప్రమాణస్వీకారం
Advertisement

AP High Court: ఏపీ హైకోర్టుకు ఇద్దరు శాశ్వత న్యాయమూర్తులను నియమించారు. జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, గోపాలకృష్ణారావు ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటివరకు అదనపు న్యాయమూర్తులుగా వీరిద్దరు ఉన్నారు. ఈ నెల 13న వీరిద్దరు శాశ్వత న్యాయమూర్తులుగా నియమించేందుకు ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. వీరి నియామాకాన్ని నోటీఫై జారీచేస్తూ.. సుప్రీంకోర్టు కౌలీజియం చేసిన సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది.

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన న్యాయాధికారి వెంకట జ్యోతిర్మయి డిగ్రీ వరకు తెనాలిలోనే విద్యాభ్యాసం చేశారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్న ఆమె.. 2008లో నేరుగా జిల్లా జడ్జి కేడర్ కు ఎంపిక అయ్యారు. పలు జిల్లాలకు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

Advertisement

Also Read: రెడ్ బుక్ లో ఉన్నవారంతా వాళ్లే.. :మంత్రి లోకేష్

ఇక వెణుతురు మల్లి గోపాలకృష్ణారావుది కృష్ణాజిల్లాలోని చెల్లపల్లి. 1994లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. 2016 నుంచి అదనపు జిల్లా న్యాయమూర్తులుగా కొన్ని జిల్లాలకు న్యాయసేవలు అందించారు. ఆ తర్వాత గుంటూరు జిల్లాలో అదనపు జడ్జిగా సేవలు అందించిన సమయంలో గతేడాది జనవరిలో ఆంధ్రప్రదేశ్ అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు కౌలీజియం చేసిన సిఫారసు మేరకు శాశ్వత న్యామూర్తులుగా నేడు ప్రమాణస్వీకారం చేశారు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×