BigTV English

AP High Court: ఏపీ హైకోర్టుకు ఇద్దరు శాశ్వత న్యాయమూర్తులు.. ప్రమాణస్వీకారం

AP High Court: ఏపీ హైకోర్టుకు ఇద్దరు శాశ్వత న్యాయమూర్తులు.. ప్రమాణస్వీకారం

AP High Court: ఏపీ హైకోర్టుకు ఇద్దరు శాశ్వత న్యాయమూర్తులను నియమించారు. జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, గోపాలకృష్ణారావు ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటివరకు అదనపు న్యాయమూర్తులుగా వీరిద్దరు ఉన్నారు. ఈ నెల 13న వీరిద్దరు శాశ్వత న్యాయమూర్తులుగా నియమించేందుకు ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. వీరి నియామాకాన్ని నోటీఫై జారీచేస్తూ.. సుప్రీంకోర్టు కౌలీజియం చేసిన సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది.


గుంటూరు జిల్లా తెనాలికి చెందిన న్యాయాధికారి వెంకట జ్యోతిర్మయి డిగ్రీ వరకు తెనాలిలోనే విద్యాభ్యాసం చేశారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్న ఆమె.. 2008లో నేరుగా జిల్లా జడ్జి కేడర్ కు ఎంపిక అయ్యారు. పలు జిల్లాలకు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

Also Read: రెడ్ బుక్ లో ఉన్నవారంతా వాళ్లే.. :మంత్రి లోకేష్


ఇక వెణుతురు మల్లి గోపాలకృష్ణారావుది కృష్ణాజిల్లాలోని చెల్లపల్లి. 1994లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. 2016 నుంచి అదనపు జిల్లా న్యాయమూర్తులుగా కొన్ని జిల్లాలకు న్యాయసేవలు అందించారు. ఆ తర్వాత గుంటూరు జిల్లాలో అదనపు జడ్జిగా సేవలు అందించిన సమయంలో గతేడాది జనవరిలో ఆంధ్రప్రదేశ్ అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు కౌలీజియం చేసిన సిఫారసు మేరకు శాశ్వత న్యామూర్తులుగా నేడు ప్రమాణస్వీకారం చేశారు.

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×