BigTV English
Advertisement

Red Book: రెడ్ బుక్ లో ఉన్నవారంతా వాళ్లే.. :మంత్రి లోకేష్

Red Book: రెడ్ బుక్ లో ఉన్నవారంతా వాళ్లే.. :మంత్రి లోకేష్

Red Book: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు.. ప్రతిపక్ష వైసీపీ నేతలు రెడ్ బుక్ పై ఆరోపణలు చేస్తున్నారు. రెడ్ బుక్ పేరు చెప్పి.. తమపార్టీ వాళ్లను భయపెడుతున్నారని ఆరోపించిన సందర్భాలున్నాయి. ఎన్నికల ప్రచార సమయంలో నారా లోకేశ్ ఈ రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొచ్చారు. తాజాగా ఈ రెడ్ బుక్ పై మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.


మంగళగిరి నరసింహస్వామి ఆలయానికి నూతనంగా నిర్మించిన ముఖద్వారాన్ని లోకేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెడ్ బుక్ లో రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్లందరి పేర్లు ఉన్నాయని, చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిన వారందరిపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులపై.. నివేదిక వచ్చిన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Also Read: మంగళవారం విదేశాలకు.. జగన్‌కు గ్రీన్ సిగ్నల్.. కాకపోతే..


ఇటీవలే మాజీ సీఎం జగన్ కూడా రెడ్ బుక్ పై వ్యాఖ్యలు చేశారు. ఎవరిని తొక్కేయాలి.. ఎవరిపై కేసులు పెట్టాలి.. ఎవరి ఆస్తుల్ని ధ్వంసం చేయాలన్న విషయాలనే అందులో రాసుకున్నారని వ్యంగ్యంగా మాట్లాడారు. రెడ్ బుక్ ను ఎవరు పడితే వాళ్లు తెరవడం, దానిపేరుతో విధ్వంసాలు చేయడం పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు. అధికారపార్టీ వాళ్లే అరాచకాలు చేసి.. వాటిని తమ నేతలపై రుద్దుతున్నారని వాపోయారు.

రెడ్ బుక్ పేరు చెప్పి.. అధికారులను, నేతలను అధికారపార్టీ భయపెడుతోందని వాపోతున్న వైసీపీ నేతలు.. తాజాగా మంత్రి లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Related News

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబును కలవనున్న శ్రీచరణి

AP Liquor: నకిలీ మద్యం కేసులో 11 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు..

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Big Stories

×