E-Paper
Advertisement

Red Book: రెడ్ బుక్ లో ఉన్నవారంతా వాళ్లే.. :మంత్రి లోకేష్

Red Book: రెడ్ బుక్ లో ఉన్నవారంతా వాళ్లే.. :మంత్రి లోకేష్
Advertisement

Red Book: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు.. ప్రతిపక్ష వైసీపీ నేతలు రెడ్ బుక్ పై ఆరోపణలు చేస్తున్నారు. రెడ్ బుక్ పేరు చెప్పి.. తమపార్టీ వాళ్లను భయపెడుతున్నారని ఆరోపించిన సందర్భాలున్నాయి. ఎన్నికల ప్రచార సమయంలో నారా లోకేశ్ ఈ రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొచ్చారు. తాజాగా ఈ రెడ్ బుక్ పై మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

మంగళగిరి నరసింహస్వామి ఆలయానికి నూతనంగా నిర్మించిన ముఖద్వారాన్ని లోకేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెడ్ బుక్ లో రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్లందరి పేర్లు ఉన్నాయని, చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిన వారందరిపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులపై.. నివేదిక వచ్చిన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Also Read: మంగళవారం విదేశాలకు.. జగన్‌కు గ్రీన్ సిగ్నల్.. కాకపోతే..

ఇటీవలే మాజీ సీఎం జగన్ కూడా రెడ్ బుక్ పై వ్యాఖ్యలు చేశారు. ఎవరిని తొక్కేయాలి.. ఎవరిపై కేసులు పెట్టాలి.. ఎవరి ఆస్తుల్ని ధ్వంసం చేయాలన్న విషయాలనే అందులో రాసుకున్నారని వ్యంగ్యంగా మాట్లాడారు. రెడ్ బుక్ ను ఎవరు పడితే వాళ్లు తెరవడం, దానిపేరుతో విధ్వంసాలు చేయడం పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు. అధికారపార్టీ వాళ్లే అరాచకాలు చేసి.. వాటిని తమ నేతలపై రుద్దుతున్నారని వాపోయారు.

Advertisement

రెడ్ బుక్ పేరు చెప్పి.. అధికారులను, నేతలను అధికారపార్టీ భయపెడుతోందని వాపోతున్న వైసీపీ నేతలు.. తాజాగా మంత్రి లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×