E-Paper
Advertisement

Yuvagalam: లోకేశ్ పాదయాత్రకు ట్రబుల్స్ స్టార్టెడ్.. ప్రచారరథం సీజ్..

Yuvagalam: లోకేశ్ పాదయాత్రకు ట్రబుల్స్ స్టార్టెడ్.. ప్రచారరథం సీజ్..
Advertisement

Yuvagalam: యువగళం పేరుతో నారా లోకేశ్ సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. కుప్పంలో యువగళం ఆరంభం నుంచే.. ఈ యాత్రను కొనసాగనిస్తారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఎందుకంటే, లోకేశ్ పాదయాత్రకు ముందునుంచీ కొర్రీలు పెడుతూనే వస్తోంది ప్రభుత్వం. జీవో నెంబర్ 1 తీసుకొచ్చి.. పర్మిషన్ కోసం చుక్కలు చూపించారు. ఎట్టకేళకు అనుమతి అయితే ఇచ్చారు కానీ.. ముందుముందు పోలీసుల తీరు ఎలా ఉంటుందో అనే అనుమానాలు మాత్రం వీడలేదు.

అందుకు తగ్గట్టే.. చిత్తూరు జిల్లా పలమనేరులో యువగళంకు ఝలక్ ఇచ్చారు పోలీసులు. నారా లోకేశ్‌ ప్రచారరథం మైక్‌కు అనుమతి లేదంటూ ఆ వాహనాన్ని పలమనేరు పోలీసులు సీజ్‌ చేశారు.

Advertisement

పాదయాత్రలో భాగంగా క్లాక్ టవర్ సెంటర్లో ప్రజలను ఉద్దేశించి ప్రచార రథం మీదనుంచి మాట్లాడారు నారా లోకేశ్. ప్రసంగం అయిపోయాక.. లోకేశ్ మళ్లీ పాదయాత్ర ప్రారంభించారు. అంతలోనే పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. పాదయాత్రలో మైక్ కు అనుమతి లేదంటూ ప్రచారరథాన్ని సీజ్ చేశారు పోలీసులు. వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు నారా లోకేశ్. ఏ రాజ్యాంగం, ఏం చట్టం ప్రకారం వాహనాన్ని సీజ్‌ చేశారని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్‌ 1 రాజ్యాంగానికి వ్యతిరేకమని మండిపడ్డారు. లోకేశ్ కు మద్దతుగా టీడీపీ శ్రేణులు సైతం ఆందోళనకు దిగారు. దీంతో, వెనక్కి తగ్గిన పోలీసులు ప్రచార రథాన్ని విడిచిపెట్టారు. లోకేశ్ యువగళం పాదయాత్రను కొనసాగించారు.

Advertisement

ఇది జస్ట్ శాంపిలేనా? ముందుముందు పోలీసుల నుంచి ఇలాంటి అడ్డంకులు మళ్లీ మళ్లీ వస్తాయా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ వర్గీయులు. యువగళానికి వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేకే.. పోలీసులను ప్రయోగిస్తున్నారంటూ అధికార వైసీపీపై విరుచుకుపడుతున్నారు టీడీపీ శ్రేణులు.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×