BigTV English
Advertisement

Pawan Kalyan Comments Grandhi Srinivas: రౌడీ చేతిలో భీమవరం బందీ.. వైసీపీ ఎమ్మెల్యేను ఓడించాలని పవన్ కల్యాణ్ పిలుపు

Pawan Kalyan Comments Grandhi Srinivas: రౌడీ చేతిలో భీమవరం బందీ.. వైసీపీ ఎమ్మెల్యేను ఓడించాలని పవన్ కల్యాణ్ పిలుపు

Pawan kalyan bhimavaram meeting


Pawan Kalyan Bhimavaram Meeting: ఏపీలో వలసల పర్వం కొనసాగుతోంది. తాజాగా జనసేనలో మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేరారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయన గతంలో భీమవరం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు.

భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పై పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. కుబేరులు ఎక్కువగా ఉండే భీమవరం రౌడీ చేతిలో బందీగా మారిందని మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యే చేసిన అరాచకాల ప్రభావం అతని కులంపై పడుతోందన్నారు.


భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ ను ఓడించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. భీమవరాన్ని తాను వదిలిపెట్టేది లేదని స్పష్టంచేశారు. ఇక్కడ నుంచి రౌడీయింజ పోయే వరకు పోరాడతానని తేల్చిచెప్పారు. జనసేన అభ్యర్థిని గెలిపిస్తే భీమవరంలో డంపింగ్ యార్డును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

Also Read: బీజేపీ కోసం తగ్గిన జనసేన.. పొత్తులో మారిన సీట్ల లెక్కలు.. ఎవరికెన్నంటే..

పులపుర్తి రామాంజనేయులు చేరిక జనసేనకు బలాన్ని ఇచ్చిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఆయనే టీడీపీ, జనసేన పొత్తు విషయంలో కీలకంగా మారారని తెలిపారు. 2019 ఎన్నికల్లో భీమవరంలో తాను ఓడిపోయినా జనం మద్దతుగా నిలిచారని చెప్పారు.

రాజకీయాల్లో యుద్ధమే ఉంటుందని జనసేనాని స్పష్టం చేశారు. బంధుత్వాలు ఉండవన్నారు. అంతిమ లక్ష్యం ప్రభుత్వాన్ని మార్చడమేనని స్పష్టంచేశారు. వైసీపీ నేతలు చేస్తున్న దాడులను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మే 15 లోపు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. సిద్ధం.. సిద్ధం అని కోకిలలా కూస్తున్న జగన్ ఓడిద్దామన్నారు.

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×