BigTV English

Pawan Kalyan: పాకిస్తాన్ బోర్డర్‌లో గుర్రం ఎక్కించి.. చెప్పుకు చెప్పు..

Pawan Kalyan: పాకిస్తాన్ బోర్డర్‌లో గుర్రం ఎక్కించి.. చెప్పుకు చెప్పు..
PERNI NANI VS PAWAN KALYAN

Pawan Kalyan vs Perni Nani(AP politics): ఏపీ రాజకీయం మాటలు దాటుతోంది. పవన్ వారాహి విజయయాత్ర వైసీపీలో కాక రేపుతోంది. అసలే పవన్. మాస్ లీడర్. వార్నింగులు ఇవ్వడంలో ఎక్స్‌పర్ట్. తన పదునైన విమర్శలతో అధికార పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు. వైసీపీకి అంతా భయపడుతుంటే.. తాను మాత్రం చెప్పు చూపించి మరీ ఎదిరించానని ఘనంగా చెప్పుకొచ్చారు. ఇది విని వైసీపీ షాక్ అయింది. నిజమేగా.. ఏడాది క్రితం జనసేనాని తమకు చెప్పు చూపించి బెదిరించాడనే విషయం ఇప్పుడు మరోసారి గుర్తుకొచ్చింది. వెంటనే చెప్పుకు చెప్పులు చూపించాలని డిసైడ్ అయింది. ఎప్పటిలానే పేర్ని నాని మీడియా ముందు వాలిపోయారు. పవన్ ఒక్క చెప్పు చూపిస్తే.. పేర్ని రెండు చెప్పులు చూపించి.. టిట్ ఫర్ టాట్ అన్నారు.


ఈ విషయం జనసేనాని దృష్టికి వెళ్లింది. ఆయన మాత్రం చాలా లైట్ తీసుకున్నారు. వైసీపీ నాయకులు తిడుతున్నారంటే.. తిట్టనివ్వండని అన్నారు. తాను మాత్రం సీరియస్ పొలిటిషియన్‌నని.. ఇలా కామెడీలు చేయడానికి రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు. మీసాలు తిప్పడాలు, తొడలు కొట్టడాలు లాంటివి తాను సినిమాల్లోనే చేయలేదని.. అలా చేయడానికి తాను ఇబ్బంది పడుతుంటానని అన్నారు. తాను మాటలతో సమాధానం చెప్పే టైప్ కాదని.. చేతల్లో చూపిస్తానంటూ చెప్పారు. పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు చింతించే రోజు ఒకటి వస్తుందని హెచ్చరించారు. అంత సరదా ఉంటే.. గుర్రం ఎక్కించి పాకిస్తాన్ బోర్డర్లోకి పంపితే అప్పుడు తెలుస్తుందని పేర్నిపై పవర్ పంచ్‌లు వదిలారు పవన్ కల్యాణ్.


Related News

AP GST Collections: ప‌న్నుల రాబ‌డిలో ప‌రుగులు తీస్తున్న ఏపీ.. సెప్టెంబ‌ర్ నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వ‌సూళ్లు

AP Heavy Rains: తీవ్ర వాయుగుండం.. ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్.. ప్రజలు బయటకు రావొద్దు

Visakha Heavy Rains: వాయుగుండం ఎఫెక్ట్.. విశాఖలో భారీ వర్షాలు, గాలుల బీభత్సం

Kurnool News: దసరా ఫెస్టివల్.. రాత్రికి దేవరగట్టులో కర్రల సమరం.. భారీగా ఏర్పాటు

Jagan Vs Chandrababu: సీఎం చంద్రబాబుపై జగన్ మరో అస్త్రం.. ఇప్పటికైనా మేలుకో, లేకుంటే

Vijayawada Durga Temple: దసరా రోజున వీఐపీ దర్శనాలు లేవు.. కృష్ణానది ఉద్ధృతితో తెప్పోత్సవం రద్దు: దుర్గగుడి ఈవో

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా 57 కేవీలు

CM Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు.. అక్టోబర్ 4న వారి ఖాతాల్లో రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

Big Stories

×