E-Paper
Advertisement

Pawan Kalyan : అదే లక్ష్యం .. ముఖ్యమంత్రి పదవిపై పవన్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan : అదే లక్ష్యం .. ముఖ్యమంత్రి పదవిపై పవన్ కీలక వ్యాఖ్యలు
Advertisement

Pawan Kalyan : ఏపీలో జనసేనాని వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి. మంగళగిరి జనసేన ఆఫీస్‌లో జరిగిన పార్టీ ముఖ్య నేతల భేటీలో పవన్‌కల్యాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పని చేయాలని.. టీడీపీ-జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని జనసైనికులకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి పదవి కంటే ప్రజల భవిష్యత్తు ముఖ్యమని.. ఒకటి రెండు చోట్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ ముందుకెళ్లాలని సూచించారు. తానెప్పుడూ సీఎం పదవికి విముఖత చూపలేదని.. ముఖ్యమంత్రి పదవిపై సుముఖంగానే ఉంటానని అన్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వం మారిన తర్వాత ప్రస్తుత అధికార పార్టీ చేసిన విద్యాశాఖ కుంభకోణాలపై దృష్టి పెడతామన్నారు. అవినీతితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ జైలుకి పంపుతామని పవన్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచీ విద్యావ్యవస్థను దుర్వినియోగం చేస్తోందన్నారు. విద్యార్థులకు ఐబీ సిలబస్ అమలు వెనుక పెద్ద కుంభకోణం ఉందని పవన్ ఆరోపించారు. విద్యార్థులు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడేందుకు ఇన్ని వేల కోట్ల ఖర్చవుతుందా అని ప్రశ్నించారు. దీనిపై వైసీపీ ప్రభుత్వం వివరణ ఇవ్వాలన్నారు.

Advertisement

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత.. ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. చంద్రబాబుకు మద్దతు తెలిపిన ఆయన.. ఆ పార్టీతో జతకట్టి జగన్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇక త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీడీపీతో కలిసి గెలుపుబావుట ఎగురవేయాలన్న సంకల్పంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పవన్‌కల్యాణ్‌ సీఎం పదవిపై కీలకవ్యాఖ్యలు చేశారు. అయితే,.. చంద్రబాబు వారసుడిగా లోకేష్‌, నందమూరి వారసుడిగా బాలకృష్ణ టీడీపీలో కీలక నేతలుగా ఉన్న పరిస్థితుల్లో.. ప్రతిపక్షాలు ఆశిస్తున్నట్టు టీడీపీ-జనసేనల ప్రభుత్వం ఏర్పాటైతే వారిద్దరి పేర్లు కూడా తెరపైకి వచ్చే అవకాశముంది. మరి భవిష్యత్తులో ఏం తేలనుందో తెలియాలంటే ఎన్నికలు జరిగి.. ఫలితాలు వెల్లడయ్యే వరకూ వేచి చూడాల్సిందే.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×