Pawan Reaction: నాగేశ్వర్ పై కేసులు వద్దు ఎపీ డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ కోసం ఏపీ పోలీసులు తెలంగాణ వెళ్లారని తెలిసిందని అన్నారు. కేసు వద్దు ఎమి వద్దు ఆయనను వదిలేయమని చెప్పాను అని అన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ పొరపాటున మాట్లాడి ఉండొచ్చు కేసు ఉపసంహరణ చేసుకోమని చెప్పాను అని అన్నారు. విశ్లేషణలకు అర్థం పర్థం లేదు.
విశ్లేషకులు వారు ఎదగడానికో, గుర్తింపు పొందడానికో మాట్లాడుతున్నారని పవన్ కళ్యాన్ అన్నారు. సీనియర్ విశ్లేషకులు పొరపాటున మాట్లాడినా వదిలేయాలని అన్నారు. కానీ కొన్ని వెబ్ సైట్స్ నాపై పదేపదే ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తున్నాయని అన్నారు. వారిపై తోలు తీసే విధంగా కఠిన చర్యలు ఉంటాయని పవన్ కళ్యాన్ హెచ్చరిక చేశారు.
మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ విశ్లేషకుడైన ప్రొఫెసర్ నాగేశ్వరరావు నేడు రాష్ట్ర డీజీపీ సీ.వీ.ఆనంద్ ను కలిశారు. తనప జరుగుతున్న దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని కోరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ పై ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే ఆయనపై ఆంధ్రప్రదేశ్ లోని ఇంద్రపాలెం స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కూడా జారీ అయ్యింది.
Also Read: ఆటోలు, బ్యాటరీలే టార్గెట్.. పక్కా స్కెచ్తో పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు!