E-Paper
Advertisement

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌లో పవన్.. నేతలతో చర్చ, ఆ డబ్బుంతా కరెంటుకే

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌లో పవన్.. నేతలతో చర్చ, ఆ డబ్బుంతా కరెంటుకే
Advertisement

Rushikonda Palace: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పైనే గడిచిపోయింది. మరి రుషికొండ ప్యాలెస్ మాటేంటి? అద్దెకు ఇచ్చే ఆలోచన ఉందా? ఎవరూ ముందుకురావడం లేదా? ఈ ప్యాలెస్‌ని ఏంచెయ్యబోతున్నారు? అద్దెకు ఇస్తే కనీసం విద్యుత్ ఛార్జీ వస్తుందని అంటున్నారు. శుక్రవారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పార్టీ నేతలతో కలిసి రుషికొండ ప్యాలెస్‌ను సందర్శించారు.

విశాఖ రుషికొండలో జగన్ నిర్మించిన మాయామహల్‌ని కూటమి ప్రభుత్వం ఏం చెయ్యబోతోంది? స్టార్ హోటళ్లకు ఇచ్చే ప్రయత్నం చేస్తోందా? దీన్ని ఎవరికి అప్పగించాలో తెలియక తర్జనభర్జన పడుతుందా? పదే పదే కూటమి నేతలు సందర్శించడం వెనుక అసలు కథేంటి? అన్నదే అసలు ప్రశ్న.

Advertisement

మూడురోజుల క్యాంప్ నేపథ్యంలో విశాఖలో ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. శుక్రవారం ఉదయం పవన్ కల్యాణ్.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి రుషికొండ ప్యాలెస్‌ని సందర్శించారు. ఆ ప్యాలెస్‌ని చూసి ఆ పార్టీ నేతలు షాకయ్యారు. అందులో ఒక్కోదాని ధర గురించి చెబుతుంటే విని సైలెంట్ అయిపోయారు. నోటి వెంట మాట రాలేదు.

రుషికొండ ప్యాలెస్ గురించి వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు డిప్యూటీ సీఎం. అనుమతులకు మించి కొండను తవ్వారని, దీనివల్ల పర్యావరణం పూర్తి దెబ్బతిందన్నారు. ఆదాయాన్ని సమకూర్చేలా ఈ భవనాలను ఉపయోగించాలన్నారు. ప్రకృతితో పెట్టుకుంటే ఉన్నది పోతుందన్నారు.

Advertisement

ALSO READ: పోలీసుల విచారణలో అరుణ.. వాళ్లకు చెమటలు 

ఒకప్పుడు ఏడాదికి 7 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి వచ్చేందన్నారు. రుషికొండపై వచ్చే కోటి రూపాయల ఆదాయం కేవలం కరెంటుకే వెచ్చించి స్థితికి తెచ్చారన్నారు. నెలకు కరెంటు, నిర్వహణ బిల్లులు కలిసి దాదాపు 70 లక్షలు అవుతున్నట్లు తెలుస్తోంది.

నిర్మాణాల సమయంలో జీవీఎంసీ, టూరిజం విభాగాల్లో అవినీతి జరిగినట్టు అంచనాకు వచ్చారు. దానిపై విచారణ చేపట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చినా, ప్రభుత్వం ఆదీనంలో ఉండాలన్నారు. 10 ఎకరాల్లో నిర్మాణం చేపట్టారని, అందులోని మూడు భవనాలు అందుబాటులోకి తీసుకొస్తే ఉపయోగించుకోవచ్చన్నారు.

మరో నాలుగు భవనాలు ఎందుకు నిర్మాణం చేపట్టారో తెలీదన్నారు. దీన్ని టూరిజం శాఖకు అప్పగించిస్తే ఎలా ఉంటుందని భావిస్తున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్, సెమినార్, ప్రభుత్వ సమిట్‌లను అక్కడ చేస్తే బాగుంటుందని రివ్యూ మీటింగ్‌‌లో డిప్యూటీ సీఎం అన్నట్లు సమాచారం.

తొలుత రూ. 164 కోట్లతో ఈ భవనాలను నిర్మించాలని ప్లాన్ చేసినట్టు తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. చివరకు మూడు భవనాలకు రూ. 450 కోట్లు అయ్యిందన్నారు.  ఈ పర్యటన వల్ల ఏం చేయ్యాలని అనేదానిపై చర్చించనున్నారు. తొలుత ఆయా భవనాల్లో సేఫ్టీ ఆడిటింగ్ నిర్వాహించాలని అనుకున్నట్లు తెలిపారు.

 

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×