E-Paper
Advertisement

Pawan kalyan: సింగపూర్‌కు పవన్, చిన్న కొడుక్కి ఏం జరిగింది?

Pawan kalyan: సింగపూర్‌కు పవన్, చిన్న కొడుక్కి ఏం జరిగింది?
Advertisement

Pawan kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ రేపో మాపో సింగపూర్‌కు వెళ్తున్నారు. ఆయన చిన్న కొడుకు మార్క్‌ శంకర్‌ సింగపూర్‌లో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. శంకర్‌ చదువుతున్న పాఠశాలలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శంకర్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు.

అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా రెండురోజులపాటు ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. మార్క్ శంకర్ ఘటన విషయం తెలియగానే పర్యటన ఆపాలని అధినేత పవన్‌కు నేతలు సూచన చేశారు. అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని అక్కడి గిరిజనులకు మాట ఇచ్చానని అన్నారట.

Advertisement

అన్న మాట ప్రకారం ఆ గ్రామానికి వెళ్ళి వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటానని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు ఏర్పాట్లు చేశారని, ఇప్పుడు అర్థాంతరంగా వెల్లడం కష్టమని, పూర్తి చేసిన తర్వాత వెళ్తానని నాయకులకు చెప్పారు. ఈ విషయంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మరోవైపు మార్క్‌ శంకర్‌కు ఘటన గురించి తెలియగానే కుటుంబసభ్యులు కంగారు‌పడ్డారు. ఏజెన్సీ పర్యటన ముగిసిన తర్వాత పవన్ దంపతులు సింగపూర్‌కు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మార్క్ శంకర్ చదువుతున్న పాఠశాలలో సోమవారం అనుకోకుండా అగ్నిప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

Advertisement

ALSO READ: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్

అక్కడ సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో శంకర్ చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఇబ్బందులకు లోనయ్యాడని తెలుస్తోంది. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆసుపత్రిలో కోలుకున్నట్లు పాఠశాల వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

 

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×