E-Paper
Advertisement

Pawan Kalyan Comments on Jagan: ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు.. జగన్, చంద్రబాబు, ఆపై ఫిల్మ్ ఇండస్ట్రీ!

Pawan Kalyan Comments on Jagan: ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు.. జగన్, చంద్రబాబు, ఆపై ఫిల్మ్ ఇండస్ట్రీ!
Advertisement

Pawan Kalyan Comments on CM Jagan: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరు కుంది. ప్రధాన పార్టీ ముఖ్యనేతలు పేపర్లు, టీవీ ఛానెళ్లకు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇచ్చేస్తు న్నారు. అధికారంలో ఉన్నవారు పాలన గురించి వివరించగా, విపక్ష నేతలు కూటమిగా ఎందుకు జత కట్టామన్నది చెప్పుకునే ప్రయత్నం చేశారు. గడిచిన ఐదేళ్లలో ఏపీలో జరిగిన దాని గురించి డీటేల్స్‌గా బయటపెట్టారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్.

చంద్రబాబు- తాను కలవడం వెనుక గొప్ప కారణం ఉందన్నారు పవన్‌కల్యాణ్. చంద్రబాబు తనకు బంధువు కాదని, ప్రజాస్వామ్య పరిరక్షణ అనేది మా ఇద్దరిలో కామన్ పాయింట్‌గా చెప్పుకొచ్చారు. చంద్ర బాబు జైలులో ఉన్నప్పుడు నేరుగా వెళ్లి సంఘీభావం తెలిపానని గుర్తు చేశారు. నలభై ఏళ్లు రాజకీయాల్లో ఉండే వ్యక్తికి ఇలాంటి పరిస్థితి వస్తే.. రేపటి రోజున మన భవిష్యత్తు ఏంటన్నది ప్రతీ ఒక్కరిలోనూ ఉందని, అందుకే తాను జైలుకి వెళ్లి ఆయనను కలిశానని చెప్పుకొచ్చారు జనసేన అధినేత.

Advertisement

పనిలోపనిగా జగన్ వ్యవహారశైలి గురించి కూడా మనసులోని మాట బయటపెట్టారు పవన్. జగన్‌కు అహంకారం ఎక్కువని, ఆయన చెప్పింది అందరూ వినాలనే స్వభావమున్న వ్యక్తని చెప్పారు. ఒకప్పుడు చిరంజీవి, రాజమౌళి, ప్రభాస్, మహేష్‌బాబు వంటి స్టార్ హీరోలంతా సీఎం జగన్‌ను కలిశారు. వీళ్లకు.. సినిమా టికెట్లకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఏదైనా ఉంటే ప్రభుత్వం.. నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్‌తో మాట్లాడుకోవాలన్నారు. సినిమా హీరోలు వచ్చి టికెట్ల గురించి అడిగితేగానీ జగన్ అహం  తగ్గలేదన్నారు. మరో విషయం ఏంటంటే.. ఈసారి ఎన్నికల్లో మద్దతు కావాలని తాను మా అన్నయ్యనే కాదు పరిశ్రమలో ఏ ఒక్కరినీ అడగలేదన్నారు.

Also Read: Kumari aunty: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కుమారీ ఆంటీ.. ఎవరి తరఫున అంటే..?

Advertisement

2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ గురించి తాను ఊహించినదంతా నిజమైందన్నారు పవన్. వాళ్లు కేవలం హింసనే నమ్ముకున్నారన్నారు. ఇది అత్యంత ప్రమాదకర నేరాలకు దారితీస్తుందనే విషయం అప్పట్లోనే అర్థమైందన్నారు. అక్రమాలతో సంపాదించిన డబ్బుతో రాజకీయాలు చేస్తున్న జగన్, ఎవరు ఎలా బతకాలో, ఎవరు భయపడాలో చెబుతున్నారని, చివరకు అధికారులను సైతం బెదిరిస్తున్నా రని వెల్లడించారు.

టీడీపీ-బీజేపీ-జనసేన మధ్య పొత్తులకు మధ్యవర్తిని తానేనని వెల్లడించారు జనసేన అధినేత. కొన్ని సందర్భాల్లో బలంగా ఉండాలని అనుకునేవాడినని, కాకపోతే ప్రజల భవిష్యత్తును ఆలోచించానన్నారు. అందుకే సీట్ల విషయంలోనూ తగ్గాల్సి వచ్చిందంటూ మనసులోని మాట బయటపెట్టారు. ముఖ్యంగా చట్టచభలో చంద్రబాబు వైఫ్ ప్రస్తావన తెచ్చి ఆమెను కించపరిచేలా మాట్లాడాల్సిన అవసరం వైసీపీకి లేదన్నారు. ఈ విషయంలో అందుకే తాను స్పందించానని తెలిపారు.

Also Read:  ఏపీలో ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్.. రికార్డు స్థాయిలో పోలింగ్..

సంక్షేమానికి సీఎం జగన్ ఆద్యుడేమీ కాదని, ఆయన కంటే ముందు పథకాలు ఉన్నాయని గుర్తు చేశారు పవన్‌కల్యాణ్. జగన్ మాత్రం తానే సంక్షేమం ఇస్తున్నట్లు గొప్పులు చెప్పకోవడం తగదన్నారు. ఇదేమైనా రాచరికమా అని అన్నారు. ప్రజల కోసం తన సొంత డబ్బుల్లో ఒక్క రూపాయి ఇచ్చే గుణం ఆయనకు లేదన్నారు. అసలు సంపద క్రియేట్ చేయపోతే, సంక్షేమ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఆయన చేసింది కూడా అదేనన్నారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్.

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×