E-Paper
Advertisement

Pinnelli in Narasaraopeta : పిన్నెల్లిపై పోలీసుల నిఘా.. అరెస్టుకు రంగం సిద్ధం ?

Pinnelli in Narasaraopeta : పిన్నెల్లిపై పోలీసుల నిఘా.. అరెస్టుకు రంగం సిద్ధం ?

Police deployed, Pinnelli staying at Narasaraopeta: ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. నేటితో ఆయనకు హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ ముగియనుంది. కోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగియడంతో పిన్నెల్లిని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో పిన్నెల్లి తలదాచుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పిన్నెల్లి మరోసారి తప్పించుకోకుండా.. పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. అనిల్ కుమార్ యాదవ్ ఇంటి వద్ద పోలీసులు మరింత భద్రతను పెంచారు. పిన్నెల్లిపై పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం సహా.. 3 హత్యాయత్నం కేసులు ఎదుర్కొంటున్నారు పిన్నెల్లి.

మే 13న ఏపీలో ఎన్నికల పోలింగ్ జరుగగా.. అదేరోజున పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విధ్వంసం సృష్టించారు. పోలింగ్ బూత్ లో ఈవీఎం ను పగులగొట్టి హడావిడి చేసిన వీడియో బయటికి రావడంతో.. ఏపీలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఆ తర్వాత మహిళను దుర్భాషలాడటం, సీఐపై చేయి చేసుకోవడం, టీడీపీ ఏజెంట్ పై హత్యాయత్నం.. ఇలా పిన్నెల్లిపై నాలుగు కేసులు ఫైల్ అవ్వగా.. అరెస్ట్ భయంతో తెలంగాణ నుంచి పారిపోయేందుకు స్కెచ్ వేశారు. పిన్నెల్లిని అదుపులోకి తీసుకునేందుకు మాచర్ల పోలీసులు వెంబడించగా.. సినీ ఫక్కీలో ఆయన తప్పించుకున్నారు.

Also Read : పిన్నెల్లికి సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పుపై ఆగ్రహం

మే 23న హై కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు.. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో జూన్ 5 వరకూ ఆయనపై చర్యలు తీసుకొవద్దని పోలీసులకు ఆదేశాలిచ్చింది. పిన్నెల్లికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మే 27న మరో మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరగా.. మే 28న బెయిల్ మంజూరైంది. జూన్ 6కు కేసును వాయిదా వేసింది.

పిన్నెల్లిపై ఉన్న కేసులను విచారణకు తీసుకోకుండా బెయిల్ మంజూరు చేయడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. జూన్ 6న పూర్తి విచారణ చేసి.. కేసును క్లోజ్ చేయాలని హైకోర్టును ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం. నాలుగు కేసుల్లో ఆయన్ను జూన్ 6 వరకూ అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వడాన్ని తప్పుబట్టింది. ఇది న్యాయాన్ని అపహాస్యం చేసేలా ఉందని అసహనం వ్యక్తం చేసింది.

 

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×