Puttaparthi: సత్యసాయి భౌతికంగా మన మధ్య లేకున్నా, ఆయన ప్రేమ మనతోనే ఉందన్నారు ప్రధాని నరేంద్రమోదీ. విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని అన్నారు. సత్యసాయి జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు ప్రధాని నరేంద్రమోదీ. భారతీయ నాగరికతకు సేవ మూల కేంద్రమని, భక్తి, జ్ఞానం, కర్మ, ఈ మూడు సేవతోనే ముడిపడి ఉంటాయన్నారు.
ఘనంగా సత్యసాయి శత జయంతి ఉత్సవాలు
సేవ పరమ ధర్మమని మన నాగరికత చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. బాబా బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని, అందరినీ ప్రేమించు, అందర్నీ సేవించు ఇదే బాబా నినాదమన్నారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా సత్యసాయి పేరిట నాణెం, స్టాంపు విడుదల చేశారు ప్రధాని నరేంద్రమోదీ. తొలుత స్పీచ్ ప్రారంభంలో ఎందరో మహానుభావులు.. అందరికీ వందనములు అని ప్రస్తావించారు.
బాబా బోధనల ప్రభావం దేశమంతా కనిపిస్తోందని, కోట్లాది మంది బాబా భక్తులు మానవ సేవ చేస్తున్నారని తెలిపారు. బాబా ప్రేమ సూత్రాలు ఎందరినో ఆలోచింప జేశాయని, చాలామంది జీవితాలను సమూలంగా మార్చారని వివరించారు. లక్షల మందిని సేవా మార్గంలో నడిపించారని అన్నారు. ప్రజల కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, తాను నీరు, వైద్యం, విద్య వంటి రంగాల్లో విశిష్ట సేవలు అందించారని గుర్తు చేశారు.
ఉత్సవాలకు హాజరైన ప్రధాని నరేంద్రమోదీ
20 వేల మంది బాలికలకు ఇవాళ సురక్ష సమృద్ధి యోజన అందించార న్నారు. అంతకుముందు ఢిల్లీ నుంచి నేరుగా ప్రధాని నరేంద్రమోదీ పుట్టపర్తి చేరుకున్నారు. ఎయిర్పోర్టు నుంచి నేరుగా ప్రశాంతి నిలయం వద్దకు చేరుకున్నారు. సాయి కుల్వంత్ హాలులో సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. ఆ తర్వాత హిల్ వ్యూ ఆడిటోరియానికి వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. అక్కడే ప్రధాని మోదీని సన్మానించారు సీఎం చంద్రబాబు.
ALSO READ: సత్యసాయి శత జయంతి ఉత్సవాలు, సచిన్-ఐశ్వర్య ఆసక్తికర కామెంట్స్
భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ..
ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు
సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టం
భౌతికంగా సత్యసాయి మనతో లేకపోవచ్చు కానీ ఆయన అందించిన ప్రేమ, సేవా భావన కోట్లాది మందికి మార్గనిర్దేశనం
– ప్రధాని మోదీ pic.twitter.com/Zuljz0shyG
— BIG TV Breaking News (@bigtvtelugu) November 19, 2025