E-Paper
Advertisement

Police Inquiry on TDP Pulivarthi Nani Case: నాని దాడి కేసు.. ఆ రోజు ఏం జరిగిందంటే..? వెనుక నుంచి..

Police Inquiry on TDP Pulivarthi Nani Case: నాని దాడి కేసు.. ఆ రోజు ఏం జరిగిందంటే..? వెనుక నుంచి..
Advertisement

Police Inquiry on TDP Pulivarthi Nani Case: తిరుపతిలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులవర్తి నాని దాడి కేసులో విచారణ వేగవంతమైంది. ఈ కేసులో పోలీసులు నమోదు చేసిన ఛార్జిషీట్లను పరిశీలించారు డీఎస్పీ రవి మనోహరాచారి. ఈ క్రమంలో టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిని విచారించారు. వీల్ చైర్‌లో ఆయన డీఎస్పీ కార్యాలయానికి వచ్చారు. దాదాపు గంటకుపైగానే నానిని విచారించినట్టు తెలుస్తోంది.

దాడి ఎలా జరిగిందనే నుంచి కీలక విషయాలు రాబట్టారు. మే 14న శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన దాడులకు కర్మ, కర్త, క్రియ అన్నింటికి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన కొడుకు మోహిత్‌రెడ్డి, రఘునాథ్‌రెడ్డి, భానుకుమార్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారని చెప్పారు. వీరిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారాయన.

Advertisement

విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన టీడీపీ అభ్యర్థి నాని, చెవిరెడ్డి కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నట్లు ఆరోపించారు. ఆయనకు దూరమవుతున్న అనుచరులపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. దాడుల వెనుకున్న ముసుగు దొంగలను బయటకు లాగాలని కోరినట్టు చెప్పుకొచ్చారు. అంతేకాదు పోలీసులు కొందరు అమాయకులపై పెట్టిన కేసుల విషయమై చర్చించినట్టు చెప్పుకొచ్చారు.

Also Read: ఈవీఎం డ్యామేజ్ కేసు, పిన్నెల్లికి బిగ్ రిలీప్, అప్పటివరకు మాత్రమే

Advertisement

ముఖ్యంగా టీడీపీకి చెందిన 70 మంది కార్యకర్తలపై అన్యాయంగా 307, 435 సెక్షన్ల కింద కేసులు పెట్టారని వివరించారు నాని. తన గన్‌మెన్‌పై దాడి చేసిన ఘటనలో తిరుమలకు చెందిన ఓ డమ్మీ వ్యక్తిని అరెస్టు చేసినట్టు తెలిపారు. దాడులకు సుత్రధారులుగా వ్యవహరించిన వారిని తప్పనిసరిగా శిక్షించాలని పులవర్తి నాని డిమాండ్ చేశారు.

Tags

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×