E-Paper
Advertisement

AP : రజనీకాంత్ స్పీచ్ పై పొలిటికల్ వార్.. వైసీపీ నేతలకు బాబు కౌంటర్…

AP : రజనీకాంత్ స్పీచ్ పై పొలిటికల్ వార్.. వైసీపీ నేతలకు బాబు కౌంటర్…
Advertisement

AP : ఏపీలో రజనీకాంత్ స్పీచ్.. వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధాన్ని మరింత పెంచింది. విజయవాడలో నిర్వహించిన ఎన్టీఆర్‌ శతజయంతి కార్యక్రమంలో పాల్గొన్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్.. చంద్రబాబును విజన్ ఉన్న నాయకుడిగా పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధి బాబుతోనే సాధ్యమని స్పష్టంచేశారు.

Advertisement

రజనీ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడ్డారు. రోజా, కొడాలి నాని, జోగి రమేష్ లాంటి నేతలు సూపర్ స్టార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. రజనీకాంత్‌కు తెలుగు రాష్ట్రం, రాజకీయాలపై అవగాహన లేదన్నారు. ఆయన వ్యాఖ్యలతో ఎన్టీఆర్‌ ఆత్మ కూడా బాధపడుతుందన్నారు. రజనీకాంత్‌తో చంద్రబాబు అబద్ధాలు చెప్పించారని మండిపడ్డారు.
చంద్రబాబు లేనప్పుడే హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు. విదేశాల్లో తెలుగువారు ఉద్యోగాలు పొందడానికి కారణం వైఎస్ఆర్ అని ..కానీ చంద్రబాబు కాదని రజనీకాంత్‌ తెలుసుకోవాలని గట్టిగానే విమర్శలు చేశారు.

వైసీపీ నేతల విమర్శలను టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. తీవ్ర అహంకారంతో అధికారపార్టీ నేతలు చేస్తున్న విమర్శలను తెలుగు ప్రజలెవరూ సహించరన్నారు. ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని.. అనుభవాలను పంచుకున్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌పై వైసీపీ మూకల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణం అని చంద్రబాబు ట్వీట్ చేశారు. రజనీ లాంటి లెజెండరీ పర్సనాలటీపై కూడా వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ పోకడలపై ఆయన చిన్న విమర్శ కూడా చేయలేదు.. ఎవరినీ చిన్న మాట అనలేదని గుర్తు చేశారు.

Advertisement

పలు అంశాలపై రజనీ కేవలం తన అభిప్రాయాలు పంచుకున్నారని చంద్రబాబు ట్వీట్ లో వివరించారు. శిఖరం లాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్‌పై వైసీపీ నేతల విమర్శలు ఆకాశంపై ఉమ్మి వేయడమేనని పేర్కొన్నారు. నోటి దురుసు గల నేతలను సీఎం వైఎస్ జగన్ అదుపులో పెట్టుకోవాలని సూచించారు. రజనీకాంత్ కు క్షమాపణ చెప్పి తమ తప్పు సరిదిద్దుకోవాలన్నారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×