E-Paper
Advertisement

PM Modi: నేడు ఏపీ, తమిళనాడు పర్యటనకు ప్రధాని మోదీ..

PM Modi: నేడు ఏపీ, తమిళనాడు పర్యటనకు ప్రధాని మోదీ..
Advertisement

PM Modi: నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొంటారు. అలాగే, కోయంబత్తూరులో జరిగే రైతుల సదస్సులో పీఎం కిసాన్ 21వ విడత నిధులను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మోడీ తన పర్యటనపై ఎక్స్ వేదికగా స్పందించారు. సత్యసాయి బాబా సమాజ సేవను, ఆధ్యాత్మిక చైతన్యాన్ని గుర్తు చేసుకున్నారు.

పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో.. పాల్గొననున్న మోడీ..
ఉదయం 10 గంటలకు పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం చేరుకుంటారు ప్రధాని. శ్రీ సత్యసాయి బాబా మహాసమాధిని సందర్శించి నివాళులర్పిస్తారు. అనంతరం 10:30 గంటలకు జరిగే శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా సత్యసాయి బాబా గౌరవార్థం ఒక స్మారక నాణెం, ప్రత్యేక స్టాంపులను విడుదల చేసి, సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

Advertisement

కోయంబత్తూరులో జరిగే రైతుల సదస్సులో.. పీఎం కిసాన్ 21వ విడత నిధుల విడుదల..
ప్రధాని ఏపీ నుంచి తమిళనాడుకు బయలుదేరుతారు. మధ్యాహ్నం 1:30 గంటలకు కోయంబత్తూరులో దక్షిణ భారత సహజ వ్యవసాయ సదస్సు 2025ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చేలా పీఎం కిసాన్ పథకం కింద నిధులను విడుదల చేస్తారు. 21వ విడత కింద 18,000 కోట్లకు పైగా నిధులను విడుదల చేయనున్నారు ప్రధాని మోడీ. ఈ సదస్సులో ఏపీ, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల నుంచి సుమారు 50,000 మంది రైతులు, నిపుణులు పాల్గొననున్నారు.

Also Read: కర్నూల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ఇద్దరు మృతి..

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×