E-Paper
Advertisement

Rachamallu Siva Prasad Reddy : పోలీసులకు సారీ చెప్పిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే .. ఆ వ్యాఖ్యలు ఉపసంహరణ..

Rachamallu Siva Prasad Reddy : పోలీసులకు సారీ చెప్పిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే .. ఆ వ్యాఖ్యలు ఉపసంహరణ..
Advertisement

Rachamallu Siva Prasad Reddy : ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎక్సైజ్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారు. పోలీసులకు క్షమాపణలు తెలిపారు. తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని రాచమల్లు వివరణ ఇచ్చారు. మద్యం కొనుగోళ్లకు సంబంధించి చట్టంలో మార్పులు తీసుకురావాలని సూచించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రికి లేఖ కూడా రాస్తానని చెప్పారు.

గురువారం కడప జిల్లా ప్రొద్దుటూరు SEB అధికారులపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలు అవసరాలకు మద్యం తీసుకెళితే నిబంధనలు పేరుతో వేధిస్తున్నారని మండిపడ్డారు. ప్రొద్దుటూరుకు చెందిన పుల్లయ్య అనే వ్యక్తి మరికొంత మందితో కలిసి.. తన తల్లి కర్మఖాండల కార్యక్రమం కోసం 30 మద్యం బాటిళ్లు కొనుగోలు చేశారు. షాపు నుంచి కిందకు దిగగానే పుల్లయ్యను సెబ్ అధికారులు అరెస్ట్ చేశారు.

Advertisement

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే.. SEB కార్యాలయానికి వెళ్లి అధికారుల తీరుపై తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవారిని ఇబ్బందులకు గురిచేస్తే ఎన్నిసార్లు అయినా ఇలాగే వచ్చి ప్రశ్నిస్తానంటూ ఎమ్మెల్యే అన్నారు. పోలీసులపై ఎమ్మెల్యే రాచమల్లు తీరుపై విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన పోలీసులకు క్షమాపణలు చెప్పారు.

.

Advertisement

.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×