E-Paper
Advertisement

Rachamallu Siva Prasad Reddy : పోలీసులకు సారీ చెప్పిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే .. ఆ వ్యాఖ్యలు ఉపసంహరణ..

Rachamallu Siva Prasad Reddy : పోలీసులకు సారీ చెప్పిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే .. ఆ వ్యాఖ్యలు ఉపసంహరణ..

Rachamallu Siva Prasad Reddy : ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎక్సైజ్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారు. పోలీసులకు క్షమాపణలు తెలిపారు. తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని రాచమల్లు వివరణ ఇచ్చారు. మద్యం కొనుగోళ్లకు సంబంధించి చట్టంలో మార్పులు తీసుకురావాలని సూచించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రికి లేఖ కూడా రాస్తానని చెప్పారు.

గురువారం కడప జిల్లా ప్రొద్దుటూరు SEB అధికారులపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలు అవసరాలకు మద్యం తీసుకెళితే నిబంధనలు పేరుతో వేధిస్తున్నారని మండిపడ్డారు. ప్రొద్దుటూరుకు చెందిన పుల్లయ్య అనే వ్యక్తి మరికొంత మందితో కలిసి.. తన తల్లి కర్మఖాండల కార్యక్రమం కోసం 30 మద్యం బాటిళ్లు కొనుగోలు చేశారు. షాపు నుంచి కిందకు దిగగానే పుల్లయ్యను సెబ్ అధికారులు అరెస్ట్ చేశారు.

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే.. SEB కార్యాలయానికి వెళ్లి అధికారుల తీరుపై తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవారిని ఇబ్బందులకు గురిచేస్తే ఎన్నిసార్లు అయినా ఇలాగే వచ్చి ప్రశ్నిస్తానంటూ ఎమ్మెల్యే అన్నారు. పోలీసులపై ఎమ్మెల్యే రాచమల్లు తీరుపై విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన పోలీసులకు క్షమాపణలు చెప్పారు.

.

.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×