E-Paper
Advertisement

Pulivendula ByPoll: పులివెందులలో పోలింగ్.. నన్ను బంధించారన్న వైసీపీ అభ్యర్థి, జగన్ ఖర్చు రూ100 కోట్లు

Pulivendula ByPoll: పులివెందులలో పోలింగ్.. నన్ను బంధించారన్న వైసీపీ అభ్యర్థి, జగన్ ఖర్చు రూ100 కోట్లు
Advertisement

Pulivendula ByPoll: పులివెందుల బైపోల్‌ను వైసీపీ అధినేత జగన్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారా? కోట్లాది రూపాయలు కుమ్మరిస్తున్నారా? వైసీపీ జెడ్పీ‌టీసీ అభ్యర్థిని బంధించిందెవరు? ఓ వైపు పోలింగ్.. మరోవైపు నేతలు మాటలు కోటలు దాటుతున్నాయి.

కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ సీట్లకు మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. సాయంత్రం 5 వరకు జరగనుంది. ఉదయం నుంచే ఓటర్లు తమతమ పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడికానున్నాయి. పోలింగ్ మొదటి నుంచి ప్రలోభాల పర్వం ఊపందుకుంది.

Advertisement

ఈ ఉప ఎన్నిక కోసం జగన్ వంద కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి. ఇంకా డబ్బులు పంచుతూనే ఉన్నారంటూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు. మహిళలకు ముక్కు పుడకలు, చీరలు పంపిణీ చేస్తున్నారని, పోలీసులు పట్టించుకోలేదని వాపోయారు. అవినీతి సొమ్మును పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక కోసం కుమ్మరిస్తున్నారని మండిపడ్డారు.

మరోవైపు పులివెందులలో పోలింగ్ ను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్‌రెడ్డి విమర్శించారు. తన ఇంటి చుట్టూ టీడీపీ గూండాల‌ను పెట్టిందని, క‌ర్ర‌లు-రాడ్లు ప‌ట్టుకుని తిరుగుతున్నారని అన్నారు.

Advertisement

ALSO READ: ఏపీ లిక్కర్ కేసులో కొత్త విషయాలు, బిగ్‌బాస్ చుట్టూ ఉచ్చు

ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థికి రక్షణ కల్పించలేని దుస్థితిలో పోలీసులు ఉన్నారని మండిపడ్డారు. పోలింగ్ బూత్ లోపలికి ఏజెంట్లను ఎవరినీ వెళ్లనీయలేదన్నారు. ఈ మేరకు ఆయన ఓ విడియో విడుదల చేశారు. ప్రధాన పార్టీలకు సంబంధించిన కీలక నేతలు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు భారీగా మోహరించారు.

జరుగుతున్న పరిణామాలను చూస్తున్న ప్రజలు, అసెంబ్లీకి ఎన్నిక జరుగుతున్నట్లు ఉందని అంటున్నారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత  ఓటర్లు ఈ తరహా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించు కుంటున్నారు.  300  పైగా బైండోవర్ కేసులు నమోదు చేశారు. లాడ్జి, హోటళ్లు తనిఖీలు చేశారు. వేరే ప్రాంతాల నుంచి వచ్చినవారిని వారి ప్రాంతాలకు తరలించారు.

 

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×