BigTV English
Advertisement

Congress Ministers: తెలంగాణలో సంక్షోభానికి కారణం బీఆర్ఎస్సే.. కేసీఆర్‌పై మంత్రులు ఫైర్..

Congress Ministers: తెలంగాణలో సంక్షోభానికి కారణం బీఆర్ఎస్సే.. కేసీఆర్‌పై మంత్రులు ఫైర్..
Congress Ministers On KCR & BRS
Congress Ministers On KCR & BRS

Congress Ministers On KCR & BRS: తెలంగాణలో సంక్షోభానికి బీఆర్ఎస్ పార్టీనే కారణమని.. వెయ్యి గజాల లోతున పాతి పెట్టినా తప్పులేదని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు. శుక్రవారం కరీంనగర్ పర్యటనలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు మండిపడ్డారు.


బీఆర్ఎస్ పాలన వల్లే తెలంగాణలో కరువు వచ్చిందని అన్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు కమీషన్ భగీరథ అని.. వెయ్యి కోట్ల స్కామ్ జరిగిందని పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ మాట్లాడారు.

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం డిజైన్ చేసిన ప్రాణాహిత చేవెళ్ల ప్రాజెక్టును కమీషన్ల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం రీడిజైన్ చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో వరద కాల్వలు ఎండిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని అన్నారు. నిపుణుల సలహా తీసుకుని.. వారి అభిప్రాయాల మేరకే ప్రాజెక్టులపై ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఏపీ సీఎం కృష్ణా జలాలు తరలించుకుపోతే కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు.


Also Read: Congress Party: నేడు తుక్కుగూడలో కాంగ్రెస్‌ జనజాతర బహిరంగ సభ..

కేసీఆర్ పొగరు అహంకార వల్లే బీఆర్ఎస్‌కు తక్కువ సీట్లు వచ్చాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారని అన్నారు.

ఇక చేనేత కార్మికులను ఏనాడు పట్టించుకోలేదని.. వారికి తీవ్ర ద్రోహం చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. తెలంగాణలో సంక్షోభానికి కారణం బీఆర్ఎస్సేనని మండిపడ్డారు.

Related News

Delhi Bomb Blast: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఘటన.. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..?

Delhi Blast: ఢిల్లీ బాంబు పేలుడు.. హైదరాబాద్ లో పోలీసులు అలర్ట్.. రేపు జూబ్లీ పోలింగ్ ఉంటుందా..?

Iconic Bridge: హైదరాబాద్‌లో అద్భుతమైన ఐకానిక్ బ్రిడ్జ్.. టెండర్‌కు అప్రూవల్ ఇచ్చిన ప్రభుత్వం

Kalvakuntla Kavitha: హరీష్‌ను టార్గెట్ చేస్తున్న కవిత

Paddy Procurement Record: ధాన్యం సేకరణలో తెలంగాణ రికార్డు.. మంత్రులు ఉత్తమ్, తుమ్మల సమీక్ష

Delhi Blast High Alert: దిల్లీ బ్లాస్ట్ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో హైఅలర్ట్‌.. పలుచోట్ల ముమ్మర తనిఖీలు

Nizamabad: దందాలు మూసుకోండి.. బీజేపీ లీడర్లకు ధర్మపురి వార్నింగ్

Top 20 News @ 9 PM: గ్రోత్ హబ్‌గా విశాఖ, కేటీఆర్‌కి వ్యతిరేఖంగా పోస్టర్స్

Big Stories

×