BigTV English

AP Industrial Development: ఏపీలోని ఆ జిల్లాలకు మంచిరోజులు.. అక్కడి వారికి పెద్ద పండగే!

AP Industrial Development: ఏపీలోని ఆ జిల్లాలకు మంచిరోజులు.. అక్కడి వారికి పెద్ద పండగే!

AP Industrial Development: ఏపీలో పెట్టుబడుల పంట బాగా పండుతోంది. ఓ ప్రముఖ ప్రైవేట్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌ వైపు మొగ్గుచూపి, వేల కోట్ల పెట్టుబడితో భారీ పరిశ్రమలను స్థాపించేందుకు ముందుకు రావడం తెలిసిందే. ఇది కేవలం పెట్టుబడులే కాదు, వేలాది మందికి ఉద్యోగ అవకాశాల పంటను తీసుకురానుంది. పరిశ్రమలు వచ్చిన ప్రాంతాల్లో ప్రజల జీవన విధానం మారనుంది, ఉపాధి అవకాశాలతో గ్రామీణ ప్రాంతాలు ఉత్సాహంతో నిండనున్నాయి.


ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేస్తూ వీటికి అనుమతులు మంజూరు చేయడం, రాష్ట్రం పరిశ్రమల గమ్యంగా మారుతున్న సంకేతంగా భావించవచ్చు. ఒకప్పుడు వలస వెళ్లిన యువతకు ఇప్పుడు సొంత ఊళ్లలోనే ఉద్యోగ అవకాశాలు పలకరించనున్నాయి. ఈ మార్పు వెనుక ఉన్న పెట్టుబడి వివరాలు, పరిశ్రమల స్థాపన ప్రణాళికలు నిజంగా ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి.

అసలు విషయం ఏమిటంటే?
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి దిశగా మరో పెద్ద అడుగు పడింది. ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ రేమండ్ గ్రూప్, రాష్ట్రంలోని 2 ముఖ్యమైన జిల్లాలైన అనంతపురం, అలాగే నూతనంగా ఏర్పడిన సత్యసాయి జిల్లాల్లో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చింది. ఈ సంస్థ రూ.1,201.95 కోట్ల పెట్టుబడితో పరిశ్రమలు ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వం ఈ మేరకు అనుమతులు మంజూరు చేస్తూ తాజాగా జీవో జారీ చేసింది.


అసలేంటి లాభం?
ఈ పరిశ్రమలు రాష్ట్రానికి పెట్టుబడులే కాకుండా, యువతకు ఉపాధి అవకాశాలను కూడా తీసుకురానున్నాయి. మొత్తం 6,571 మందికి ఈ పరిశ్రమల ద్వారా నేరుగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. వ్యవసాయంపై ఆధారపడి ఉన్న ఈ ప్రాంతాల్లో పరిశ్రమల అభివృద్ధి వల్ల ఆర్థికంగా మరింత బలోపేతం జరగనుంది.

రేమండ్ గ్రూప్ ఈ పెట్టుబడులను మూడు గ్రామాల పరిధిలో చేయనుంది. ఇందులో ఒక గ్రామం అనంతపురం జిల్లాలో ఉండగా, మిగతా రెండు గ్రామాలు సత్యసాయి జిల్లా పరిధిలో ఉన్నాయి. ఇది అక్కడి రైతులకు, స్థానిక ప్రజలకు ప్రత్యక్షంగా లాభాలను కలిగించనుంది. భూముల విలువ పెరగడం, ఉపాధి అవకాశాలు పెరగడం, అనుబంధ సేవలకు డిమాండ్ రావడం లాంటి పరిణామాలు ఈ పెట్టుబడి వల్ల నెలకొనున్నాయి.

Also Read: Secunderabad to Visakha train: రైలు టికెట్ ధరల పెంపు.. సికింద్రాబాద్ – విశాఖ రైళ్ల కొత్త ఛార్జీలు ఇవే

ఈ పరిశ్రమల ఏర్పాటుతో కేవలం కార్మికులకు ఉద్యోగాలు మాత్రమే కాదు, అక్కడి చిన్న వ్యాపారులకు, ట్రాన్స్‌పోర్ట్, హోటల్, ఇతర సేవా రంగాలకు కూడా విస్తృత అవకాశాలు ఏర్పడనున్నాయి. దీని వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మెరుగైన మార్పు కనిపించనుంది.

ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశ్రమల ఏర్పాటుకు అన్ని విధాలుగా సహకరించేందుకు ముందుకు వచ్చింది. సింగిల్ విండో సిస్టమ్‌ ద్వారా అనుమతులు త్వరితగతిన ఇచ్చి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తగిన ప్రణాళిక రూపొందించబడింది.

రేమండ్ గ్రూప్ లాంటి సంస్థలు తమ పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్‌ వైపు మళ్లించడం ద్వారా, రాష్ట్రం పరిశ్రమల గమ్యం అవుతుందనే నమ్మకాన్ని మరింత బలపరుస్తోంది. ముఖ్యంగా నైరుతి ప్రాంతాల్లో ఈ తరహా పెట్టుబడులు ఉద్యోగాల లోటును తీర్చడంలో సహాయపడతాయి. అక్కడి ప్రజలకు ఇది ఒక నూతన ఆత్మవిశ్వాసాన్ని నింపనుంది.

ఇదే తరహాలో మరిన్ని కంపెనీలు ముందుకు వచ్చేందుకు ఇది ఒక శుభ సంకేతంగా మారుతోంది. ఒకప్పుడు వలస కూలీలుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లిన యువత ఇప్పుడు తమ సొంత ఊర్లలోనే ఉపాధిని సంపాదించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. దీనితో పాటు మహిళలకూ ఉద్యోగ అవకాశాలు వచ్చేలా పరిశ్రమల ప్రణాళిక రూపొందించబడినట్లు సమాచారం.

అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రేమండ్ పరిశ్రమల ప్రారంభంతో ఆ ప్రాంతాల రూపురేఖలు మారబోతున్నాయి. స్థానికుల జీవన విధానం మారబోతోంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో, ప్రైవేట్ పెట్టుబడుల వర్షంతో రాష్ట్రంలో పరిశ్రమల పంట బాగా పండుతోంది. ఇక అక్కడి ప్రజలకు ఇది నిజంగానే ఒక పెద్ద పండగేనని ప్రభుత్వంతో పాటు స్థానిక యువకులు అంటున్నారు.

Related News

Pawan on Pulivendula: పులివెందుల విక్టరీపై పవన్ కామెంట్స్.. అక్కడి పరిస్థితులే కారణం

Nandyal Accident: ఆళ్లగడ్డలో ఘోర ప్రమాదం.. రెండు బస్సులు ఢీ, ముగ్గురు మృతి

Helicopter ambulance: ఏపీలో హెలికాఫ్టర్ అంబులెన్స్ వస్తోంది.. అంతా ఉచితమే.. సర్వీస్ ఎలాగంటే?

Pulivendula Slips: బ్యాలెట్ బాక్స్ లో ఓటుతోపాటు స్లిప్పులు కూడా.. పులివెందుల ఓటర్ల మనోగతం ఏంటంటే?

AP Heavy Rains: ఏపీని ముంచెత్తిన భారీ వరదలు.. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు

Polavaram: పోలవరంపై కీలక అప్ డేట్.. మంత్రి లోకేష్ ఆసక్తికర ట్వీట్

Big Stories

×