E-Paper
Advertisement

Amaravati Republic Day celebrations: అమరావతిలో తొలిసారి.. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్, ప్రభుత్వ లక్ష్యాలను వివరించిన గవర్నర్ నజీర్

Amaravati Republic Day celebrations: అమరావతిలో తొలిసారి.. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్, ప్రభుత్వ లక్ష్యాలను వివరించిన గవర్నర్ నజీర్
Advertisement

Amaravati Republic Day celebrations: 2047 నాటికి ప్రపంచంతో పోటీపడే విధంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. కాలాను గుణంగా పాలన మారాలనేది ఏపీ ప్రభుత్వ సిద్ధాంతమన్నారు. సాంకేతికతతో క్షణాల్లో పాలన చేరేలా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు.

అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు

Advertisement

సుపరిపాలనకు పది సూత్రాలు నిర్దేశించిన గవర్నర్, పేదరిక నిర్మూలన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. కొన్నేళ్లుగా ఏపీ స్పష్టమైన దిశ లేకుండా సాగిందన్నారు. రాజధాని నిర్మాణం ఆగిపోయిందన్న గవర్నర్,  దీనివల్ల ఆర్థిక విశ్వాసం దెబ్బతిందన్నారు. ప్రజలే ప్రగతికి నిజమైన శిల్పులుగా వర్ణించారు. ప్రజల విశ్వాసం మళ్లీ మొదలైందని వివరించారు.

ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారి ప్రభుత్వం రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించింది. రాయపూడిలో సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ఈ వేడుకలు జరుగుతున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత జాతీయ గీతాన్ని ఆలపించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ఆ తర్వాత ప్రసంగించారు.

Advertisement

జాతీయ జెండా ఆవిష్కరించిన గవర్నర్, ప్రభుత్వ లక్ష్యాలు వెల్లడి

ప్రతీ పౌరుడికి గౌరవం, అవకాశాలు, న్యాయం చేస్తామన్నారు. కలిసికట్టుగా ఆరోగ్యం, ఆనందం, సౌభాగ్య ఆంధ్రప్రదేశ్‌ను నిర్మిద్దామన్నారు. ప్రతీ గ్రామం సుభిక్షంగా, ప్రతీ పట్టణం చైతన్యవంతంగా ఎదిగేలా నిర్మిద్దామన్నారు. అంతేకాదు ప్రతీ నగరం సుస్థిరంగా ఎదిగే రాష్ట్రాన్ని మనం నిర్మిద్దామన్నారు.

నీటి భద్రత, ఇంధనం, అగ్రి టెక్, మౌళిక సదుపాయాల లక్ష్యాలను ఈ సందర్భంగా వివరించారు. దీనికితోటు బ్రాండ్ ఏపీ, స్వచ్ఛాంధ్ర, స్మార్ట్ గవర్నెన్స్ లక్ష్యాలను వివరించారు. దేశంలో తొలి క్వాంటం కంప్యూటర్ ని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్పేస్ సిటీ ఏర్పాటుతో ఏపీని ఆవిష్కరణల కేంద్రంగా నిలబెడుతున్నామని తెలియజేశారు.

ALSO READ: దొంగ సారా అమ్మి దొరికిపోయి విమర్శలా?.. జోగి రమేశ్ కు మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్

వాట్సాప్ లోనే 119 ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వచ్చాయన్న గవర్నర్, డ్రోన్ రాజధానిగా ఏపీ ఎదుగుతోందన్నారు. ఓర్వకల్లులో 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ నిర్మాణం జరుగుతోందన్నారు. ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, స్పీకర్, హైకోర్టు న్యాయమూర్తులు,  ఉన్నతాధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు రాజధాని రైతులు కూడా హాజరయ్యారు.

ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతిబింబించేలా 22 శకటాలను ప్రదర్శించారు. వందేమాతరం ఇతివృత్తం, జీరో పావర్టీ మిషన్ ప్రణాళిక, వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమం, విద్య, స్త్రీ, శిశు సంక్షేమం, నైపుణ్య శిక్షణ, ఉపాధి, అటవీ శాఖలకు చెందిన శకటాలు ఆకట్టుకున్నాయి.

 

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Big Stories

Advertisement
×