BigTV English

Roja : వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు మావే : మంత్రి రోజా

Roja : వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు మావే : మంత్రి రోజా

Roja : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 సీట్లను వైసీపీ గెల్చుకుంటుందని ఆ పార్టీ నేత, మంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం లంబసింగి పర్యటనకు వెళ్తూ అనకాపల్లి జిల్లాలో మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను సంక్షేమ పథకాలతో జగన్ సర్కారు ఆదుకుంటోందని చెప్పారు.


జగన్ పాలనతో రాష్ట్రం బాగుపడిందని, అభివృద్ధివైపు పరుగులు పెడుతోందని జనం నమ్ముతున్నారని మంత్రి చెప్పారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి రోజా చెప్పారు.

రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని టూరిజం మినిస్టర్ రోజా చెప్పారు. కరోనా తగ్గుముఖం పట్టాక రాష్ట్రంలో టూరిజం పుంజుకుందని, టెంపుల్ టూరిజంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉందని చెప్పారు.


టూరిస్టు ప్రాంతాల్లో వసతుల కల్పన కోసం ప్రైవేటు భాగస్వామ్యంతో పనిచేస్తున్నామని వివరించారు. స్వదేశీ దర్శన్, ప్రసాద పథకాలలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు నాలుగు ప్రాజెక్టులు మంజూరు అయ్యాయని మంత్రి రోజా చెప్పారు.

తాము అధికారంలోకి రాగానే.. జగన్ సర్కారు తెచ్చిన సంక్షేమ పథకాలను, వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలను రద్దు చేస్తామని గతంలో టీడీపీ ప్రకటించిందని మంత్రి రోజా గుర్తుచేశారు. ఇప్పుడు మాటమార్చి, సచివాలయ ఉద్యోగులను కొనసాగిస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారని రోజా విమర్శించారు. టీడీపీ నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు.

Related News

AP Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి అతి భారీ వర్ష సూచన.. రేపు ఈ జిల్లాల్లో

YS Jagan: మీది రెడ్ బుక్ అయితే.. మాది డిజిటిల్ బుక్, కథ వేరే ఉంటది.. జగన్ సంచలన వ్యాఖ్యలు

Yellow Shirt: అసలైన పసుపు సైనికుడు.. కూతురు పెళ్లిలో కూడా పసుపు చొక్కానే

Roja Hot Comments: శుక్రవారం వస్తే జంప్.. జగన్‌పై రోజా సెటైర్లు?

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Big Stories

×