E-Paper
Advertisement

రేవంత్ రెడ్డితో విందులా?.. టీడీపీ కూడా మహిళా బిల్లుకు వ్యతిరేకమే- రోజా

రేవంత్ రెడ్డితో విందులా?.. టీడీపీ కూడా మహిళా బిల్లుకు వ్యతిరేకమే- రోజా
Advertisement

Roja Slams TDP: మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాన్ని అస్త్రంగా చేసుకుని వైఎస్సార్సీపీ నాయకురాలు రోజా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహిళా బిల్లును గతంలో అడ్డుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, అలాంటి పార్టీకి చెందిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి ఫొటోలు దిగడం, విందుల్లో పాల్గొనడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. బిల్లును వ్యతిరేకించిన వారితో భోజనాలు చేస్తున్నారంటే టీడీపీ కూడా మహిళా బిల్లుకు వ్యతిరేకమేనని ప్రజలంతా గమనిస్తున్నారని రోజా వ్యాఖ్యానించారు.

మహానాడు వేదికగా టీడీపీ ఎంపీలు, నాయకులు తాము మహిళా రిజర్వేషన్‌కు అనుకూలమంటూ మళ్లీ అబద్ధాలు చెపుతున్నారని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్, టీడీపీల మధ్య తెరవెనుక లోపాయికారీ బంధం (ఆర్ట్ లైన్ బంధం) ఉందంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో చెప్పిన మాటలను ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. టీడీపీ నాయకులు పొద్దున్నే లేస్తే బీజేపీతో బ్రేక్‌ఫాస్ట్‌లు చేస్తూ, రాత్రి వేళల్లో కాంగ్రెస్ పార్టీతో డిన్నర్లు చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.

Advertisement

మహిళా హక్కుల పట్ల వైఎస్సార్సీపీకి ఉన్న చిత్తశుద్ధిని చాటుతూ.. 2023లోనే ముఖ్యమంత్రిగా జగన్ అసెంబ్లీలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏకగ్రీవ తీర్మానం చేశారని రోజా స్పష్టం చేశారు. టీడీపీ ద్వంద్వ విధానాలను, వారి రాజకీయ అవకాశవాదాన్ని రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని ఆమె హెచ్చరించారు.

Also Read: షూటింగ్‌లో సరికొత్త రికార్డు.. ఇషా సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు!

Related News

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

గుంటూరులో మంటగలిసిన మానవత్వం.. మహిళపై దాడి చేయించిన టీడీపీ నేత, పార్టీ నుంచి సస్పెండ్!

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్ – 1, ఈ హైదరాబాద్ రాకెట్ ప్రత్యేకత ఇదే..!

ఏపీలో మారిన వాతావరణం.. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు, పిడుగుల హెచ్చరిక!

కరోనా ఈజ్ బ్యాక్.. ఏపీలో 12 కేసులు.. ఆ నలుగురి మరణానికి అసలు కారణం ఇదేనా?

Big Stories

Advertisement
×