BigTV English

Sajjala : ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. ఇప్పటం, విశాఖలపై సజ్జల..

Sajjala : ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. ఇప్పటం, విశాఖలపై సజ్జల..


Sajjala : ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నెలరోజులుగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శమన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. విశాఖలో వైఎస్ఆర్ సీపీ నిర్వహించిన గర్జన రోజునే పవన్‌ అక్కడికి వచ్చి ఉద్దేశపూర్వంగానే రాద్ధాంతం చేశారని మండిపడ్డారు.

ఇప్పటం గ్రామంలో జరిగిన ఘటనపై టీడీపీ, జనసేన రాద్దాంతం చేస్తున్నాయని సజ్జల ఆరోపించారు. ప్రభుత్వం ఆక్రమణలను కూల్చాలా..? వద్దా..? అని ప్రశ్నించారు. ఏం జరగకపోయినా సినిమా స్క్రిప్ట్‌ రాస్తున్నారని ఆరోపించారు. ఇప్పటంలో పవన్‌ అంత ఆవేశం ఎందుకు ప్రదర్శించారో అర్థం కావడంలేదన్నారు. ఇప్పటంలో గోడ కూడా కూల్చలేదని స్పష్టం చేశారు. అయినా సరే రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని క్రియేట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.


చంద్రబాబుపైనా సజ్జల విమర్శలు గుప్పించారు. నందిగామలో రాయితో దాడిచేశారని చంద్రబాబు డ్రామా చేశారని మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బాబు మాయాబజార్‌ చూపించారని విమర్శించారు. చంద్రబాబు పాలనంతా కరువే ఉందన్నారు.

Related News

AP weather alert: తీరప్రాంతంలో టెన్షన్ టెన్షన్.. 24 గంటల్లో అక్కడ దంచుడే!

AP free bus scheme: ఏపీలో ఫ్రీ బస్ రైడ్.. ఈ రూల్స్ మర్చిపోతే టికెట్ కట్టుడే!

MLA Madhavi Reddy: కుర్చీకోసం కలెక్టర్ పై ఎమ్మెల్యే ఫైర్.. చివరకు నిలబడే..

Pawan Kalyan: అప్పుడలా-ఇప్పుడిలా? వైసీపీ నేతలపై డిప్యూటీ సీఎం పవన్ రుసరుస

Vadapalli: వాడపల్లి ఆలయానికి స్వాతంత్య్ర పోరాటానికి లింకేంటి?

AP Free Bus: నేటి నుంచే ఫ్రీ బస్సు.. APSRTC వారికి షాకింగ్ న్యూస్.. 15 రోజుల తర్వాతే..!

Big Stories

×