E-Paper
Advertisement

Avinash Reddy : అవినాశ్‌కు మళ్లీ అవే ప్రశ్నలు?.. ఈసారి 7 గంటలు..

Avinash Reddy : అవినాశ్‌కు మళ్లీ అవే ప్రశ్నలు?.. ఈసారి 7 గంటలు..
Advertisement

Avinash Reddy : కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ విచారణ ముగిసింది. హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయానికి వచ్చిన ఆయన్ను అధికారులు సుదీర్ఘంగా.. ఏడు గంటల పాటు విచారించారు. ప్రతి శనివారం.. సీబీఐ విచారణకు హాజరుకావాలని.. హైకోర్టు ఆదేశాల మేరకు అవినాష్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. వైఎస్ వివేకా హత్య కేసు గురించి సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డి నుంచి కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హత్య వెనుక కుట్రకోణం, ఆర్థిక లావాదేవీలు, వాట్సాప్ కాల్ డేటా ప్రకారం.. సమాధానాలు రాబట్టినట్టు తెలుస్తోంది.

Advertisement

అడిషనల్ ఎస్పీ స్థాయిలో అధికారి సమక్షంలో అవినాష్‌రెడ్డి విచారణ కొనసాగింది. విచారణ మొత్తాన్ని వీడియోగ్రఫీ చేస్తున్నారు సీబీఐ అధికారులు. ముందస్తు బెయిల్ పొందాక నాలుగోసారి విచారణకు హాజరయ్యారు అవినాష్. అవినాష్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. అయితే జూన్ నెల చివరి వరకు ప్రతి శనివారం సీబీఐ విచారణకు హాజరుకావాలని అవినాష్‌ను హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆయన సీబీఐ విచారణకు హాజరయ్యారు. అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ను హైకోర్టు మంజూరు చేయడంతో.. అవినాష్ రెడ్డికి అరెస్ట్‌ టెన్షన్ లేకపోయింది.

అయితే వివేకా హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డిని ఇప్పటికే పలుమార్లు సీబీఐ అధికారులు విచారించారు. గత నెలలో విచారణకు రావాల్సిందిగా సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేయగా.. పలు నాటకీయ పరిణామాలు జరిగాయి. మరోవైపు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టి.. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అవినాశ్‌ తల్లి అనారోగ్యం దృష్ట్యా ఇటీవల తెలంగాణ హైకోర్టు మే 31 వరకూ అవినాశ్‌ను అరెస్ట్ చేయొద్దని సీబీఐని గతంలో ఆదేశించింది. ఆ తర్వాత ముందస్తు బెయిల్ రూపంలో అవినాష్‌కు భారీ ఊరట లభించింది.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×