E-Paper
Advertisement

Avinash Reddy : అవినాశ్‌కు మళ్లీ అవే ప్రశ్నలు?.. ఈసారి 7 గంటలు..

Avinash Reddy : అవినాశ్‌కు మళ్లీ అవే ప్రశ్నలు?.. ఈసారి 7 గంటలు..
Advertisement

Avinash Reddy : కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ విచారణ ముగిసింది. హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయానికి వచ్చిన ఆయన్ను అధికారులు సుదీర్ఘంగా.. ఏడు గంటల పాటు విచారించారు. ప్రతి శనివారం.. సీబీఐ విచారణకు హాజరుకావాలని.. హైకోర్టు ఆదేశాల మేరకు అవినాష్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. వైఎస్ వివేకా హత్య కేసు గురించి సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డి నుంచి కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హత్య వెనుక కుట్రకోణం, ఆర్థిక లావాదేవీలు, వాట్సాప్ కాల్ డేటా ప్రకారం.. సమాధానాలు రాబట్టినట్టు తెలుస్తోంది.

Advertisement

అడిషనల్ ఎస్పీ స్థాయిలో అధికారి సమక్షంలో అవినాష్‌రెడ్డి విచారణ కొనసాగింది. విచారణ మొత్తాన్ని వీడియోగ్రఫీ చేస్తున్నారు సీబీఐ అధికారులు. ముందస్తు బెయిల్ పొందాక నాలుగోసారి విచారణకు హాజరయ్యారు అవినాష్. అవినాష్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. అయితే జూన్ నెల చివరి వరకు ప్రతి శనివారం సీబీఐ విచారణకు హాజరుకావాలని అవినాష్‌ను హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆయన సీబీఐ విచారణకు హాజరయ్యారు. అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ను హైకోర్టు మంజూరు చేయడంతో.. అవినాష్ రెడ్డికి అరెస్ట్‌ టెన్షన్ లేకపోయింది.

అయితే వివేకా హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డిని ఇప్పటికే పలుమార్లు సీబీఐ అధికారులు విచారించారు. గత నెలలో విచారణకు రావాల్సిందిగా సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేయగా.. పలు నాటకీయ పరిణామాలు జరిగాయి. మరోవైపు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టి.. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అవినాశ్‌ తల్లి అనారోగ్యం దృష్ట్యా ఇటీవల తెలంగాణ హైకోర్టు మే 31 వరకూ అవినాశ్‌ను అరెస్ట్ చేయొద్దని సీబీఐని గతంలో ఆదేశించింది. ఆ తర్వాత ముందస్తు బెయిల్ రూపంలో అవినాష్‌కు భారీ ఊరట లభించింది.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×