E-Paper
Advertisement

Seetharam Thammineni: జనసేనలోకి తమ్మినేని? బొత్స భేటి.. పార్టీ మార్పుపై క్లారిటీ!

Seetharam Thammineni: జనసేనలోకి తమ్మినేని? బొత్స భేటి.. పార్టీ మార్పుపై క్లారిటీ!
Advertisement
Seetharam Thammineni: మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం జనసేన పార్టీలో చేరబోతున్నారా.. లైన్ క్లియర్ అయిందా.. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు మరి.. అనే రీతిలో జోరుగా ప్రచారం సాగుతోంది. తమ్మినేని సీతారాం జనసేనలో చేరితే, వైసీపీకి గట్టి షాక్ తగలడం ఖాయంగా చెప్పవచ్చు.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలక నేతగా వ్యవహరించారు. జగన్ వద్ద అత్యధిక మార్కులు గల నేతగా సీతారాంకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే ఏపీలో జరిగిన ఎన్నికల సమయంలో సీతారాం ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు సైతం ఆయన దూరంగా ఉండడంతో, ఏదో ఒక పార్టీలోకి జంపు కావడం ఖాయమంటూ వార్తలు హల్చల్ చేశాయి. అంతేకాదు ఇక రేపో మాపో జనసేనలోకి వెళ్లడం ఖాయమని, ప్రచారం సైతం సాగింది.

ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలలో చేరుతున్న నేపథ్యంలో వైసిపి క్యాడర్ ను కాపాడుకునే పరిస్థితిలో ఉందని చెప్పవచ్చు. తాజాగా తమ్మినేని సీతారాం సైతం జనసేన పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలపై వైసీపీ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం తమ్మినేని సీతారాం ను కలవడం విశేషం. పార్టీ మార్పు వార్తల నేపథ్యంలో బొత్స కలిశారా.. లేక సాధారణంగానే భేటీ జరిగిందా అన్నది తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: Borewell Incident: బోరుబావిలో 16 గంటలు.. బిడ్డ నరకం.. పూజల్లో తల్లి.. చివరికి మృత్యువు ఒడిలోకి!

అయితే ఆదివారం సాయంత్రం మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. జనసేనలో చేరుతానన్న ప్రచారంలో వాస్తవం లేదని, ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడడం తగదన్నారు. తన కుమారుడిని వైద్యశాలలో చేర్పించి చికిత్స అందించానని, 15 రోజులుగా వైద్యశాల వద్ద ఉన్నట్లు తమ్మినేని అన్నారు. అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్లు, తనకు జనసేనలో చేరాల్సిన అవసరం ఏమి వచ్చిందని తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. మాజీమంత్రి బొత్స భేటీ అనంతరం తమ్మినేని ఈ కామెంట్స్ చేయడం విశేషం.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×