E-Paper
Advertisement

Shiv Sena: చంద్రబాబులానే, షిండేకే శివసేన.. థాక్రేకు దిక్కేంటి?

Shiv Sena: చంద్రబాబులానే, షిండేకే శివసేన.. థాక్రేకు దిక్కేంటి?
Advertisement

Shiv Sena: ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా చంద్రబాబు నాయకత్వంలో మెజార్టీ ఎమ్మెల్యేలు జట్టు కట్టారు. ఓ హోటల్ లో మకాం వేశారు. ఎన్టీఆర్ ఆ హోటల్ ముందు ధర్నా చేస్తే.. ఆయనపై కొందరు చెప్పులు విసిరారు. పార్టీ పెట్టింది ఎన్టీఆరే, ఎన్నికల్లో గెలిచిందీ ఎన్టీఆరే.. కానీ, ఎమ్మెల్యేలంతా చంద్రబాబుకు జై కొట్టడంతో ఇటు ప్రభుత్వం, అటు పార్టీ చంద్రబాబు వశం అయింది. మెజార్టీ బేస్డ్ గా తెలుగుదేశం పార్టీ పేరును, సైకిల్ గుర్తును చంద్రబాబుకే కేటాయించింది ఎన్నికల సంఘం. ఇదంతా 1995లో ఏపీలో జరిగిన పొలిటికల్ మేటర్.

సేమ్ టు సేమ్.. మహారాష్ట్రలోనూ అదే జరిగింది. శివసేన రెండుగా చీలింది. షిండే నాయకత్వంలో మెజార్టీ ఎమ్మెల్యేలు.. ఉద్దవ్ థాక్రేను సీఎం సీటు నుంచి దించేశారు. ఓ వర్గంగా ఏర్పడి.. బీజేపీతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. శివసేన పార్టీ కోసం షిండే, థాక్రే వర్గాలు పోటీ పడ్డాయి. పార్టీ మాదంటే మాదంటూ ప్రకటనలు ఇచ్చాయి.

Advertisement

కట్ చేస్తే, ఇష్యూ ఎన్నికల కమిషన్ దగ్గరకు చేరింది. మెజార్టీ సభ్యులు షిండే నాయకత్వానికే జై కొట్టడంతో.. రూల్స్ ప్రకారం శివసేన పార్టీని షిండే వర్గానికే కేటాయిస్తూ నిర్ణయం వెల్లడించింది ఈసీ. శివసేన పేరును, పార్టీ గుర్తు అయిన విల్లు, బాణంను షిండే అండ్ కో కు కేటాయించింది ఎన్నికల కమిషన్. దీంతో, తన తండ్రి స్థాపించిన పార్టీ ఉద్దవ్ థాక్రే చేజారిపోయింది. ఇప్పుడిక మరో కొత్త పార్టీ, కొత్త పేరు పెట్టుకోవాల్సిందే.

అప్పుడు ఏపీ-టీడీపీ.. ఇప్పుడు మహారాష్ట్ర-శివసేన.. రెండు ఘటనల్లోనూ ఒకేరకమైన ఫలితం వచ్చింది. అందుకే, శివసేన ఇష్యూపై ఏపీలోనూ చర్చ నడుస్తోంది. ఆనాటి ఎన్టీఆర్-చంద్రబాబు టాపిక్ మరోసారి గుర్తుకు వస్తోంది.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×