Simhachalam Chandanotsavam: సింహాచలంలో అప్పన్న చందనోత్సవం సందడి మొదలైంది. చైత్ర బహుళ ఏకాదశిని పురస్కరించుకుని మహా వేడుకను దేవస్థానం శాస్త్రోక్తంగా చేస్తోంది. చందనోత్సవం మాట ఏమోగానీ టికెట్ల విక్రయాలలో గందరగోళం పరిస్థితి నెలకొంది. దీంతో అప్పన్న భక్తులకు కష్టాలు రెట్టింపు అయ్యాయి.
సింహాచలం అప్పన్న చందనోత్సవం సందడి
సింహాచలం అప్పన్న చందనోత్సవం సందడి మొదలైంది. ప్రతీ ఏటా చైత్ర బహుళ ఏకాదశిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దేవస్థానం శాస్త్రోక్తంగా నిర్వహిస్తోంది. ఏడాది పొడవునా స్వామి గంధపు పూతతో సింహాచలం అప్పన్న భక్తులకు దర్శనమిస్తారు. ఒక్కసారి మాత్రమే స్వామి నిజ రూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు ఎగబడతారు.
సింహాచలం అప్పన్న చందనోత్సవం టికెట్ల విక్రయాలలో గందరగోళం ఏర్పడింది. రూ.300, 1000 టికెట్ల కోసం భక్తులు బ్యాంకుల వద్ద ఉదయం 6 గంటల నుండి పడిగాపులు కాసినా నిరాశ ఎదురైంది. కేవలం 10 నిమిషాల్లో టికెట్లు అమ్ముడుపోయాయి. అయితే ఆప్లైన్ టికెట్లను విక్రయించినట్టు బ్యాంక్ సిబ్బంది చెబుతున్నారు.
టికెట్ల విక్రయంలో గందరగోళం, భక్తులు తీవ్ర కష్టాలు
ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు దర్శనం టిక్కెట్లు విక్రయిస్తామని ప్రకటన చేసింది. దీంతో బ్యాంకు దగ్గర బోర్డులు చూసి ఆందోళన చెందుతున్నారు భక్తులు. చందనోత్సవం టికెట్ల అమ్మకాల్లో బ్యాంకు సిబ్బంది విరుద్ధంగా వ్యవహారిస్తున్నారన్న వాదన సైతం లేకపోలేదు.
టికెట్ల విక్రయాల విషయంలో బ్యాంకు వ్యవహారంపై సింహాచలం దేవస్థానం అధికారులకు ఫిర్యాదు చేశారు భక్తులు. కొన్ని నిమిషాల్లో టికెట్లు అమ్మకాలు పూర్తికావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఆన్ లైన్లో టికెట్ల అమ్మకాలకు సర్వర్ల సమస్యగా మారింది. దీంతో బ్యాంకుల వద్ద బారులు తీరారు భక్తులు.
ALSO READ: నిప్పుల కొలిమిలా ఆంధ్రప్రదేశ్.. రికార్డు స్థాయికి చేరుతున్న ఎండలు!
గతేడాది చందనోత్సవం సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు చనిపోయిన విషయం తెల్సిందే. టికెట్ల అమ్మకాల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. స్వామి నిజరూప దర్శన భాగ్యం కల్పించాలని కోరుతున్నారు భక్తులు.