E-Paper
Advertisement

Supreme Court : ముందస్తు బెయిల్ రద్దుపై విచారణ.. అవినాష్ , సీబీఐకు సుప్రీంకోర్టు నోటీసులు..

Supreme Court : ముందస్తు బెయిల్ రద్దుపై విచారణ.. అవినాష్ , సీబీఐకు సుప్రీంకోర్టు నోటీసులు..
Advertisement

Supreme Court : వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. విచారణ వచ్చే జులై 3కు వాయిదా వేసింది. తదుపరి విచారణ కోసం సీజేఐ బెంచ్‌ ముందు లిస్ట్‌ చేయాలని ఆదేశించింది.

Advertisement

సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని బెంచ్ విచారణ చేపట్టింది. గత వాదనల సమయంలో సీబీఐకు నోటీసులు ఇచ్చేందుకు ధర్మాసనం‌ నిరాకరించింది. తాజాగా మాత్రం ప్రతివాదులు సీబీఐ, ఎంపీ అవినాష్‌ రెడ్డిలకు నోటీసులు జారీ చేసింది.

వివేకా హత్య కేసు దర్యాప్తును జూన్ 30 లోపు పూర్తి చేయాలని సీబీఐకు సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసింది. సునీతారెడ్డి తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. గడువులోగానే చార్జిషీట్ దాఖలు చేస్తామని సీబీఐ గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఒకవేళ సీబీఐ చార్జిషీట్ దాఖలు చేస్తే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కు కాలం చెల్లే అవకాశం ఉందని అంటున్నారు.

Advertisement

వివేకా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి మే 31న తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ ఇచ్చింది .ఈ బెయిల్ ను సవాల్ చేస్తూ సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. గత విచారణ సమయంలో తానే స్వయంగా వాదనలు వినిపించారు. కానీ సాంకేతిక అంశాలున్న నేపథ్యంలో అడ్వొకేట్ ను పెట్టుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ లుథ్రా ఆమె తరఫున తాజాగా వాదనలు వినిపించారు.

Tags

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×