E-Paper
Advertisement

YS jagan : వివేకా హత్యా కేసులో సుప్రీం సీరియస్.. టెన్షన్ లో జగన్?

YS jagan : వివేకా హత్యా కేసులో సుప్రీం సీరియస్.. టెన్షన్ లో జగన్?
Advertisement

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డికి కొత్త టెన్షన్ పట్టుకున్నట్టు తెలుస్తున్నది.2019 ఎన్నికల ముందు ఆయన సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి తన ఇంట్లో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆయన కూతురు వైఎస్ సునీత నాటి నుంచి తన తండ్రి హత్యకు న్యాయం చేయాలని.. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె పోరాడుతూనే ఉన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్ వివేకానంద రెడ్డి హత్యా ఉదంతంపై సీబీఐ ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. నాటి నుంచి విచారణ కొనసాగుతూనే ఉన్నది. పలువురిని ఈ కేసులో సీబీఐ అధికారులు ప్రత్యేకంగా విచారించారు. అయినప్పటికీ నిందితులు ఎవరో నేటికీ తెలియరాలేదు.

సీబీఐ విచారణపై సునీత అభ్యంతరం..

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో తమకు అనుమానం ఉన్న వ్యక్తుల వివరాలు ఇచ్చినా సీబీఐ విచారణ సమయంలో వాటిని పరిగణలోకి తీసుకోలేదని.. కేవలం పాక్షిక విచారణ జరిపిందని సునీత ప్రధాన ఆరోపణ.. ఈ క్రమంలోనే హైదరాబాద్ సీబీఐ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలోనే సుప్రీంను ఆమె ఆశ్రయించగా.. ముందుగా సీబీఐ ట్రయల్ కోర్టులో తేల్చుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది.ఈ మేరకు ముందుగా ఆమె ట్రయల్ కోర్టులోనే వాదనలు వినిపించారు.ఇక్కడ తనకు న్యాయం దక్కేలా లేదని భావించిన ఆమె మరోసారి సుప్రీం గడప తొక్కారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఏయే అంశాలను పరిగణలోకి తీసుకోవాలని మీరు కోరుతున్నారని సునీతను ప్రశ్నించారు.

ఇంకెంత కాలం విచారిస్తారు?

Advertisement

ఆ తర్వాత సీబీఐ అధికారులను సుప్రీం ప్రశ్నించింది. వైఎస్ వివేకా హత్య కేసు విచారణను ఇంకెంత కాలం సాగదీస్తారు? పూర్తి విచారణ జరిపి నిందితులను గుర్తించడానికి ఇంకెంత కాలం టైం పడుతుందని ప్రశ్నించింది. ఈ విషయంపై త్వరగా అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని కోరింది. ఇదిలాఉండగా, వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక వైఎస్ జగన్ ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఆయనే ఎన్నికల సమయంలో ఆస్తి తగాదాల్లో భాగంగా తన సొంత బాబాయిని హత్య చేయించారని అప్పట్లో పెద్దఎత్తున ప్రచారం జరిగింది.ఇదే కేసు విషయంలో మొన్నటివరకు మాజీ ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు విచాయించారు.

Davos WEF: దావోస్‌లో తెలంగాణ పెట్టుబడుల జాతర.. రూ. 7,000 కోట్లకు పైగా ఒప్పందాలు.. ఏఐ, క్లీన్ ఎనర్జీ హబ్‌గా తెలంగాణ!

Advertisement

తాజాగా సుప్రీంకోర్టు మరోసారి ఇన్వాల్వ్ అవ్వడంతో సీబీఐ అధికారులు విచారణలో వేగం పెంచనున్నట్టు తెలుస్తున్నది. అదే జరిగితే సునీత పేర్కొన్న విధంగా ఆమె అభిప్రాయాల మేరకు తన తండ్రి హత్య వెనుక ఎవరెవరి హస్తం ఉందని ఆమె చెబుతుందో వారిని సీబీఐ విచారించనున్నట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే జగన్‌ను సైతం సీబీఐ విచారించే చాన్స్ లేకపోలేదని తెలుస్తున్నది. ఇప్పటికే వైఎస్ వివేకా హత్య కేసులో కీలక నిందితులు ఇప్పుడు ప్రాణాలతో లేరు. కొందరు కనిపించకుండాపోయారు. ఇటువంటి సమయంలో జగన్ పాత్ర ఉందని తెలిస్తే ఆయనకు శిక్ష తప్పదని, కీలక నిందితులను కూడా జగన్ అంతమొందించారని తెలుగు తమ్ముల్లు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. సుప్రీం తీర్పుతో జగన్‌కు భయం పట్టుకున్నదని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది.

 

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×