BigTV English
Advertisement

Stone Attack Case: సీఎం జగన్ రాయిదాడి కేసులో ట్విస్ట్.. అనుమానితుడు రిలీజ్!

Stone Attack Case: సీఎం జగన్ రాయిదాడి కేసులో ట్విస్ట్.. అనుమానితుడు రిలీజ్!

Suspect Released in CM Jagan Stone Attack Case: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై జరిగిన రాయిదాడి కేసులో.. పోలీసులు అనుమానితుడిగా భావిస్తూ అదుపుపలోకి తీసుకున్న దుర్గారావును విడిచిపెట్టారు. ఈ కేసుకు, దుర్గారావుకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్న పోలీసులు గల అర్థరాత్రి దుర్గారావును అతని ఇంటివద్ద విడిచి వెళ్లారు. దుర్గారావు నాలుగు రోజులుగా కనిపించకపోవడంతో.. ఆయన ఎక్కడున్నాడో చెప్పాలని అతని భార్య పోలీస్ ఉన్నతాధికారులను వేడుకున్నా ఫలితం కనిపించలేదు. దాంతో లాయర్ సలీం.. హై కోర్టులో సోమవారం హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయాలని భావించారు.


ఇంతలో.. శనివారం ఉదయం దుర్గారావు కుటుంబ సభ్యులు.. విజయవాడ పోలీస్ కమిషనర్ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆయన ఆచూకీ చెప్పాలంటూ.. భార్య శాంతి కంటతడి పెట్టుకోగా.. వారందరినీ ఆ ప్రాంతం నుంచి పంపించేశారు. శనివారం రాత్రికి 160 CRPC నోటీసులు ఇచ్చి.. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని చెప్పి సంతకాలు తీసుకుని దుర్గారావును వదిలిపెట్టారు.

Also Read: సీఎం జగన్ పైకి రాయి.. ఎడమ కంటికి గాయం


ఈ కేసులో అజిత్ సింగ్ నగర్ కు చెందిన సతీశ్ ను ఏ1 గా చేర్చిన విషయం తెలిసిందే. మైనరైన సతీశ్ కు ఈ కేసుతో సంబంధం లేదని అతని తల్లిదండ్రులు వాపోయారు. సతీశ్ రిమాండ్ రిపోర్టులో మరో వ్యక్తి చెప్పినందునే చేశానని చెప్పినట్లు ఉండటంతో.. ఏ2 గా దుర్గారావును అనుమానించారు. అందులో భాగంగానే దుర్గారావును నాలుగురోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. సతీశ్ ఎవరో తనకు తెలీయదని దుర్గారావు ఒకే సమాధానం చెప్పడంతో.. అతడిని నిర్దోషిగా భావించి వదిలిపెట్టారని కుటుంబ సభ్యులు తెలిపారు.

Related News

TTD Chairman BR Naidu: మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం: బీఆర్ నాయుడు

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Pawan Kalyan: పంట నష్టం అంచనాలను వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Nara Lokesh: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. సింగపూర్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయులు!

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, వైసీపీ నేత సూర్యారావుకు గుండెపోటు

Botsa Satyanarayana: వైసీపీ వాళ్లను ఎలా ఇరికించాలి అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది.. బొత్స విమర్శలు

Amaravati News: స్పీకర్ అయ్యన్న క్లారిటీ.. తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యేలు, వైసీపీలో ముసలం ఖాయం?

Big Stories

×