E-Paper
Advertisement

NTR news : తాత శతజయంతి వేడుకలకు తారక్ డుమ్మా.. అందుకేనా?

NTR news : తాత శతజయంతి వేడుకలకు తారక్ డుమ్మా.. అందుకేనా?
Advertisement
Jr NTR latest news

Jr NTR latest news(Telugu cinema news) :

జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న నటుడు. అద్భుత నటనతో తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. 2009 ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించి తన ప్రసంగాలతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత సినిమాలకే పరిమితమయ్యాడు. రాజకీయ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగానే ఉంటున్నాడు. అయితే తన తాత ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనక పోవడం హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా ఎన్టీఆర్‌ రూ.100 నాణెంను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా నిర్వహించారు. నందమూరి కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్‌ దూరంగా ఉండటంపై చర్చ జరుగుతోంది.

Advertisement

తారక్ ను ఆహ్వానించామని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరి అతడే కావాలనే ఈ కార్యక్రమానికి వెళ్లలేదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాత స్మారకంగా కేంద్రం రూ. 100 నాణెం విడుదల చేసిన కార్యక్రమానికి వెళ్లలేనంత బిజీనా? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే దేవర షూటింగ్ ఉండటంతో హాజరుకాలేదని తెలుస్తోంది.

కొన్నిరోజుల క్రితం హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆ కార్యక్రమానికి తారక్ ను ఆహ్వానించారు. కానీ ఆ కార్యక్రమానికి రాలేదు. మాట్లాడితే తాత పేరు చెప్పుకునే జూనియర్‌ ఎన్టీఆర్ ఆ మహనీయుడికి ఇచ్చే గౌరవం ఇదేనా? అని నందమూరి అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దూరంగా ఉంటున్నారు. కానీ చంద్రబాబు , నారా లోకేశ్ పర్యటనల్లో కొంతమంది ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ప్రదర్శించి కలకలం రేపిన ఘటనలు చాలా చోట్ల జరిగాయి. ఇప్పుడు ఫ్యామిలీకి కూడా తారక్ దూరమయ్యారా? ఎందుకు ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు? ఈ సందేహాలు సామాన్యుల్లో వ్యక్తమవుతున్నాయి.

కొన్నిరోజుల క్రితం విజయవాడలో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు తారక్ ను ఆహ్వానించలేదని వార్తలు వచ్చాయి. ఆ కార్యక్రమంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పాల్గొన్నారు. ఆ తర్వాతే హైదరాబాద్ లో వేడుక నిర్వహించారు. అందువల్లే ఎన్టీఆర్ అలిగారని అందుకే రాలేదని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇంతకీ తారక్ మనసులో ఏముంది? తాత శతజయంతి కార్యక్రమాలకు ఎందుకు రావడంలేదు? ఈ ప్రశ్నలకు తారకే సమాధానం చెప్పాలి.

Tags

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×