E-Paper
Advertisement

TDP Campaign vehicle burn: పెట్రోల్ పోసి.. ప్రచార వాహనాన్ని నిప్పు, డ్రైవర్ సేఫ్

TDP Campaign vehicle burn: పెట్రోల్ పోసి..  ప్రచార వాహనాన్ని నిప్పు, డ్రైవర్ సేఫ్

TDP Party Campaign News(Andhra politics news): ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ హింస క్రమంగా  పెరుగుతోంది. తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ ప్రచార వాహనాన్ని తగలబెట్టారు కొంతమంది వ్యక్తులు. పీలేరు మండంలోని వాల్మీకిపురం సమీపంలో ఈ ఘటన జరిగింది. డ్రైవర్ వాహనంలో ఉండగానే కొంతమంది వ్యక్తులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. అయితే మంటలు గమనించిన డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకున్నారు.

శనివారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో టూ వీలర్‌పై వచ్చిన దుండగులు టీడీపీ ప్రచార వాహనంపై పెట్రోల్ వేసి నిప్పుపెట్టారు. వాహనంలో డ్రైవర్ రెస్ట్ తీసుకుంటున్న సమయంలో జరిగింది. ఈ ఘటనలో వాహనం కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు అతడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఘటన విషయం తెలుసుకున్న వెంటనే టీడీపీ నేతలు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. అయితే స్థానిక సీఐ టీడీపీ నేతలను కన్వీన్స్ చేశారు. నిందితులను పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. టీడీపీ కేడర్ ఆందోళనతో దాదాపు రెండు కిలోమీటర్ల మేరా ట్రాఫిక్ నిలిచి పోయింది.

ALSO READ: పిఠాపురం.. మద్యం ఎత్తులు, లిక్కర్ సీజ్ వెనుక..

ఈసారి పీలేరు నుంచి వైసీపీ తరపున చింతల రామచంద్రారెడ్డి, టీడీపీ నుంచి నల్లూరి కిషోర్‌కుమార్ రెడ్డి పోటీపడుతున్నారు. ముఖ్యంగా వైసీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి సొంత మండలం వాల్మీకిపురం. ఎన్నికల అధికారుల అనుమతితో ప్రత్యేక వాహనాన్ని తయారు చేశారు టీడీపీ నేతలు. సూపర్ సిక్స్  గ్యారెంటీ పథకాలతో ఫెక్సీలను ఏర్పాటు చేసి మూడురోజులుగా ప్రచారం చేస్తున్నారు. ఈ వాహనాన్ని కొంతమంది అనుమానితులు వెంటబడినట్టు తెలుస్తోంది. టీడీపీని అడ్డుకునేందుకు ఈ పని చేసి ఉంటారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు బయట పడతాయో చూడాలి.

 

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×