BigTV English
Advertisement

TDP Campaign vehicle burn: పెట్రోల్ పోసి.. ప్రచార వాహనాన్ని నిప్పు, డ్రైవర్ సేఫ్

TDP Campaign vehicle burn: పెట్రోల్ పోసి..  ప్రచార వాహనాన్ని నిప్పు, డ్రైవర్ సేఫ్

TDP Party Campaign News(Andhra politics news): ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ హింస క్రమంగా  పెరుగుతోంది. తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ ప్రచార వాహనాన్ని తగలబెట్టారు కొంతమంది వ్యక్తులు. పీలేరు మండంలోని వాల్మీకిపురం సమీపంలో ఈ ఘటన జరిగింది. డ్రైవర్ వాహనంలో ఉండగానే కొంతమంది వ్యక్తులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. అయితే మంటలు గమనించిన డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకున్నారు.


శనివారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో టూ వీలర్‌పై వచ్చిన దుండగులు టీడీపీ ప్రచార వాహనంపై పెట్రోల్ వేసి నిప్పుపెట్టారు. వాహనంలో డ్రైవర్ రెస్ట్ తీసుకుంటున్న సమయంలో జరిగింది. ఈ ఘటనలో వాహనం కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు అతడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఘటన విషయం తెలుసుకున్న వెంటనే టీడీపీ నేతలు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. అయితే స్థానిక సీఐ టీడీపీ నేతలను కన్వీన్స్ చేశారు. నిందితులను పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. టీడీపీ కేడర్ ఆందోళనతో దాదాపు రెండు కిలోమీటర్ల మేరా ట్రాఫిక్ నిలిచి పోయింది.


ALSO READ: పిఠాపురం.. మద్యం ఎత్తులు, లిక్కర్ సీజ్ వెనుక..

ఈసారి పీలేరు నుంచి వైసీపీ తరపున చింతల రామచంద్రారెడ్డి, టీడీపీ నుంచి నల్లూరి కిషోర్‌కుమార్ రెడ్డి పోటీపడుతున్నారు. ముఖ్యంగా వైసీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి సొంత మండలం వాల్మీకిపురం. ఎన్నికల అధికారుల అనుమతితో ప్రత్యేక వాహనాన్ని తయారు చేశారు టీడీపీ నేతలు. సూపర్ సిక్స్  గ్యారెంటీ పథకాలతో ఫెక్సీలను ఏర్పాటు చేసి మూడురోజులుగా ప్రచారం చేస్తున్నారు. ఈ వాహనాన్ని కొంతమంది అనుమానితులు వెంటబడినట్టు తెలుస్తోంది. టీడీపీని అడ్డుకునేందుకు ఈ పని చేసి ఉంటారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు బయట పడతాయో చూడాలి.

 

Related News

Amadalavalasa: ఆముదాలవలస లో వైసీపీ ముక్కలవుతుందా?

Tirumala Annadanam: అంబటి ప్రశంస.. భూమనకు ఝలక్

Top 20 News @ 9 PM: గ్రోత్ హబ్‌గా విశాఖ, కేటీఆర్‌కి వ్యతిరేఖంగా పోస్టర్స్

Spurious Ghee: కోటి సంతకాల సంగతి దేవుడెరుగు.. ముందు కల్తీ నెయ్యిలోనుంచి బయటపడేదెలా?

CM Chandrababu: మంత్రులకు సీఎం చంద్రబాబు బిగ్ టాస్క్.. ఇక తప్పు జరిగితే రెస్పాన్సిబిలిటీ మినిస్టర్లదే: సీఎం చంద్రబాబు

AP Cabinet Decisions: రూ.లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.. మరిన్ని కీలక నిర్ణయాలు

Top 20 News @ 8 PM: కాంగ్రెస్ పార్టీపై హరీష్ రావు ఆరోపణలు, ఉపాధ్యాయుడు దాడి.. వినికిడి కోల్పోయిన విద్యార్ధి

Top 20 News @ 7 PM: ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్.. త్రిషా ఇంటికి బాంబు బెదిరింపు..!

Big Stories

×