Chandrababu Comments on YS Jagan: ఉత్తరాంధ్రలోని కొండలను జగన్ అనకొండలా మింగేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని భూ స్థాపితం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పాయకరావుపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు సీఎం జగన్ పై మండిపడ్డారు.
రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైసీపీని భూ స్థాపితం చేయాలని చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రజలకు పిలుపునిచ్చారు. రూ.500 కోట్లతో సీఎం జగన్ కొండను మింగేసి ఇళ్లు కట్టుకున్నాడని ఆరోపించారు. అదే ప్రజల విషయాని వచ్చినప్పుడు మాత్రం చిన్న ఇల్లు కట్టించలేకపోయాడని విమర్శించారు.
అయితే టీడీపీ అధికారంలో వచ్చిన తర్వాత పేదలకు 2 సెంట్లలో ఇళ్లు కట్టింటి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలను జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేశారని గుర్తు చేశారు. అంబేద్కర్ ఆశయాలను జగన్ తుంగలో తొక్కారని మండిపడ్డారు.
Also Read: CM Jagan: చంద్రబాబును నమ్మడం అంటే.. పులి నోట్లో తల పెట్టడమే: జగన్
మాజీ సీఎం స్వర్గీయ ఎన్టీఆర్.. అంబేద్కర్ కు భారత రత్న రావడానికి ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. జగన్ వస్తే గంజాయి ప్రభుత్వం మరోసారి రాజ్యమేలుతోందని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అంటరానితనాన్ని నిషేధిస్తామని చంద్రబాబు అన్నారు.