E-Paper
Advertisement

Tirumala Goshala issue: గోశాల ఘటన.. వాళ్లు మొదలు పెట్టారు, వీళ్లు ఫినిష్ చేస్తున్నారు..

Tirumala Goshala issue: గోశాల ఘటన.. వాళ్లు మొదలు పెట్టారు, వీళ్లు ఫినిష్ చేస్తున్నారు..

తిరుమల గోశాల నిర్వహణపై వైసీపీ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. టీటీడీపై భూమన ఆరోపణలు బూమరాంగ్ అయినట్టు ఇప్పుడు స్పష్టమవుతోంది. తెలుగుదేశం పార్టీ ఈ వ్యవహారాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టలేదు. పాత ఆధారాలు సైతం వెదికి తీసి వైసీపీకి రివర్స్ లో కౌంటర్లిస్తోంది. ఇప్పటికే టీడీపీ నేతలు ప్రతిస్పందించారు. ఇప్పుడు వీడియోలు అప్ లోడ్ చేస్తూ సోషల్ మీడియాలో వైసీపీని టార్గెట్ చేస్తోంది టీడీపీ.

లైవ్ లో చూపిస్తాం..
ఇప్పటికే పలువురు నేతలు తిరుమల గోశాలకి వెళ్లి అక్కడి పరిస్థితుల్ని నేరుగా పర్యవేక్షించారు. వారంతా అక్కడ కరుణాకర్ రెడ్డి చెప్పినట్టుగా దారుణ పరిస్థితులు లేవని అంటున్నారు. అంతే కాదు, వీడియో సాక్ష్యాలు కూడా అలాగే ఉన్నాయి. ఇక టీడీపీ నేరుగా వైసీపీకి ఛాలెంజ్ విసిరింది. 17వతేదీ ఉదయం 10 గంటలకు వైసీపీ నేతలెవరైనా అక్కడకు వస్తే లైవ్ లోనే అన్నీ చూడొచ్చని అంటున్నారు. తిరుమలతో పెట్టుకున్నారు కాబట్టి, వారికి కౌంట్ డౌన్ మొదలైనట్టేనని విమర్శిస్తున్నారు.

గతంలో ఇలా..
వైసీపీ హయాంలో గోశాలలో జరిగిన దారుణాలు ఇవేనంటూ టీడీపీ కొన్ని వీడియోలను బయటపెట్టింది. తిరుపతి జిల్లా యర్రావారిపాళెం మండలం కమలయ్యగారిపల్లిలో ఆవులు లేకపోయినా.. అక్కడి గోశాలలో దాణాకూ టెండర్లు పిలిచి, అప్పట్లో వైసీపీ నేతలు డబ్బులు కొట్టేశారని అంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని. 2023 ఏప్రిల్ 6న, టీటీడీ గోశాలలోని గోవులకు నాచుపట్టిన నీరు ఇచ్చినట్లు అప్పటి విజిలెన్స్ ఎంక్వయిరీలో తేలిందని, దానికి సాక్ష్యంగా తమ వద్ద వీడియో కూడా ఉందని అంటున్నారు టీడీపీ నేతలు. గోవుల మరణాలతో పాటు, ఆ విజిలెన్స్ రిపోర్ట్ ని జగన్ ఎందుకు దాచి పెట్టారని వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు.

ఏది నిజం..?
గోశాలలో జరిగిన దారుణాలు అంటూ ఇటీవల భూమన కరుణాకర్ రెడ్డి కొన్ని ఫొటోలు బయటపెట్టారు. గత 3 నెలల్లో గోవులు చనిపోయిన దృశ్యాలంటూ ఆయన ఫొటోలు విడుదల చేశారు. ఇవన్నీ ఫేక్ అంటోంది టీడీపీ అండ్ టీటీడీ. ఎక్కడో గోవులు చనిపోయిన ఫొటోల్ని తీసి తిరుమల గోశాలకు ముడిపెడుతున్నారని మండిపడ్డారు నేతలు. అదే సమయంలో టీడీపీ మరికొన్ని వీడియోలు బయటపెట్టడం విశేషం. గతంలో విజిలెన్స్ తనిఖీల సమయంలో బయటపడిన వీడియోలు, ఫొటోలు ఇవేనంటూ టీడీపీ కౌంటర్లు మొదలు పెట్టింది. మరి వీటికి వైసీపీ నుంచి ఇంకా సమాధానం రాలేదు. ఒకవేళ ఇవి ఫేక్ అంటే, మరి అవి ఒరిజినల్ ఫొటోలా అని టీడీపీ ప్రశ్నిస్తుంది. మొత్తమ్మీద ఈ ఎపిసోడ్ లో వైసీపీకి పెద్దగా మైలేజీ రాకపోగా.. టీడీపీ విడుదల చేసిన ఫొటోలతో ఆ పార్టీ ఇబ్బందుల్లో పడిందని అంటున్నారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. సరైన టైమ్ చూసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షం చూస్తోంది. మొదట్లో రెడ్ బుక్ అన్నారు, అక్రమ అరెస్ట్ లు అన్నారు, ఇప్పుడు తిరుమలలో అపచారం అంటున్నారు. కానీ వీటిలో ఏదీ పెద్దగా క్లిక్ కాలేదు. ఏ విషయంలోనూ ప్రభుత్వాన్ని పక్కాగా ఇరుకున పెట్టడం వైసీపీకి సాధ్యం కావడంలేదు. గోశాల విషయంలో బ్రేకింగ్ న్యూస్ అంటూ ప్రచారం చేసి మరీ భూమన ప్రెస్ మీట్ పెట్టినా.. ఇప్పుడు వైసీపీనే ఇరుకునపడేలా కనపడుతోంది.

Tags

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×