BigTV English
Advertisement

Tirumala Goshala issue: గోశాల ఘటన.. వాళ్లు మొదలు పెట్టారు, వీళ్లు ఫినిష్ చేస్తున్నారు..

Tirumala Goshala issue: గోశాల ఘటన.. వాళ్లు మొదలు పెట్టారు, వీళ్లు ఫినిష్ చేస్తున్నారు..

తిరుమల గోశాల నిర్వహణపై వైసీపీ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. టీటీడీపై భూమన ఆరోపణలు బూమరాంగ్ అయినట్టు ఇప్పుడు స్పష్టమవుతోంది. తెలుగుదేశం పార్టీ ఈ వ్యవహారాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టలేదు. పాత ఆధారాలు సైతం వెదికి తీసి వైసీపీకి రివర్స్ లో కౌంటర్లిస్తోంది. ఇప్పటికే టీడీపీ నేతలు ప్రతిస్పందించారు. ఇప్పుడు వీడియోలు అప్ లోడ్ చేస్తూ సోషల్ మీడియాలో వైసీపీని టార్గెట్ చేస్తోంది టీడీపీ.


లైవ్ లో చూపిస్తాం..
ఇప్పటికే పలువురు నేతలు తిరుమల గోశాలకి వెళ్లి అక్కడి పరిస్థితుల్ని నేరుగా పర్యవేక్షించారు. వారంతా అక్కడ కరుణాకర్ రెడ్డి చెప్పినట్టుగా దారుణ పరిస్థితులు లేవని అంటున్నారు. అంతే కాదు, వీడియో సాక్ష్యాలు కూడా అలాగే ఉన్నాయి. ఇక టీడీపీ నేరుగా వైసీపీకి ఛాలెంజ్ విసిరింది. 17వతేదీ ఉదయం 10 గంటలకు వైసీపీ నేతలెవరైనా అక్కడకు వస్తే లైవ్ లోనే అన్నీ చూడొచ్చని అంటున్నారు. తిరుమలతో పెట్టుకున్నారు కాబట్టి, వారికి కౌంట్ డౌన్ మొదలైనట్టేనని విమర్శిస్తున్నారు.

గతంలో ఇలా..
వైసీపీ హయాంలో గోశాలలో జరిగిన దారుణాలు ఇవేనంటూ టీడీపీ కొన్ని వీడియోలను బయటపెట్టింది. తిరుపతి జిల్లా యర్రావారిపాళెం మండలం కమలయ్యగారిపల్లిలో ఆవులు లేకపోయినా.. అక్కడి గోశాలలో దాణాకూ టెండర్లు పిలిచి, అప్పట్లో వైసీపీ నేతలు డబ్బులు కొట్టేశారని అంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని. 2023 ఏప్రిల్ 6న, టీటీడీ గోశాలలోని గోవులకు నాచుపట్టిన నీరు ఇచ్చినట్లు అప్పటి విజిలెన్స్ ఎంక్వయిరీలో తేలిందని, దానికి సాక్ష్యంగా తమ వద్ద వీడియో కూడా ఉందని అంటున్నారు టీడీపీ నేతలు. గోవుల మరణాలతో పాటు, ఆ విజిలెన్స్ రిపోర్ట్ ని జగన్ ఎందుకు దాచి పెట్టారని వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు.

ఏది నిజం..?
గోశాలలో జరిగిన దారుణాలు అంటూ ఇటీవల భూమన కరుణాకర్ రెడ్డి కొన్ని ఫొటోలు బయటపెట్టారు. గత 3 నెలల్లో గోవులు చనిపోయిన దృశ్యాలంటూ ఆయన ఫొటోలు విడుదల చేశారు. ఇవన్నీ ఫేక్ అంటోంది టీడీపీ అండ్ టీటీడీ. ఎక్కడో గోవులు చనిపోయిన ఫొటోల్ని తీసి తిరుమల గోశాలకు ముడిపెడుతున్నారని మండిపడ్డారు నేతలు. అదే సమయంలో టీడీపీ మరికొన్ని వీడియోలు బయటపెట్టడం విశేషం. గతంలో విజిలెన్స్ తనిఖీల సమయంలో బయటపడిన వీడియోలు, ఫొటోలు ఇవేనంటూ టీడీపీ కౌంటర్లు మొదలు పెట్టింది. మరి వీటికి వైసీపీ నుంచి ఇంకా సమాధానం రాలేదు. ఒకవేళ ఇవి ఫేక్ అంటే, మరి అవి ఒరిజినల్ ఫొటోలా అని టీడీపీ ప్రశ్నిస్తుంది. మొత్తమ్మీద ఈ ఎపిసోడ్ లో వైసీపీకి పెద్దగా మైలేజీ రాకపోగా.. టీడీపీ విడుదల చేసిన ఫొటోలతో ఆ పార్టీ ఇబ్బందుల్లో పడిందని అంటున్నారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. సరైన టైమ్ చూసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షం చూస్తోంది. మొదట్లో రెడ్ బుక్ అన్నారు, అక్రమ అరెస్ట్ లు అన్నారు, ఇప్పుడు తిరుమలలో అపచారం అంటున్నారు. కానీ వీటిలో ఏదీ పెద్దగా క్లిక్ కాలేదు. ఏ విషయంలోనూ ప్రభుత్వాన్ని పక్కాగా ఇరుకున పెట్టడం వైసీపీకి సాధ్యం కావడంలేదు. గోశాల విషయంలో బ్రేకింగ్ న్యూస్ అంటూ ప్రచారం చేసి మరీ భూమన ప్రెస్ మీట్ పెట్టినా.. ఇప్పుడు వైసీపీనే ఇరుకునపడేలా కనపడుతోంది.

Tags

Related News

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబును కలవనున్న శ్రీచరణి

Big Stories

×