E-Paper
Advertisement

TDP vs YCP: ధర్మారెడ్డి, భూమన.. జగన్ బంధువులే, ఇదిగో వంశవృక్షం, ఆ వివరాలన్నీ లీక్!

TDP vs YCP: ధర్మారెడ్డి, భూమన.. జగన్ బంధువులే, ఇదిగో వంశవృక్షం, ఆ వివరాలన్నీ లీక్!
Advertisement

TDP vs YCP: మీ ప్రభుత్వ హయాంలో టీటీడీలో అందరూ మీ బంధువులే ఉన్నారు.. ఇదిగో సాక్ష్యమంటూ టీడీపీ ట్విట్టర్ వేదికగా.. మాజీ సీఎం జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. తిరుమల లడ్డు వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మాజీ సీఎం జగన్ స్పందించేందుకు.. మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సంధర్భంగా జగన్ మాట్లాడుతూ.. తనపై టీడీపీ ట్విట్టర్ వేదికగా దుష్ప్రచారం చేస్తుందన్నారు. అలాగే టీడీపీ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన చిత్రాన్ని ప్రదర్శిస్తూ.. తనకు వరుసకు బావగా ధర్మారెడ్డి, మామగా కరుణాకర్ రెడ్డిలు ఎలా కుటుంబీకులు అవుతారంటూ ప్రశ్నించారు. తన బంధువులందరూ టీటీడీలో ఉండి, పాలన సాగించినట్లు అబద్దపు ఆరోపణలను టీడీపీ చేస్తుందన్నారు. అలాగే అబద్దాన్ని నిజం చేసేందుకు ప్రయత్నించడంలో టీడీపీ విశ్వ ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.

Advertisement

Also Read: Minister Satyakumar: జగన్ కు షాక్.. వైఎస్సార్ జిల్లా పేరు మార్చాలంటూ సీఎంకు లేఖ రాసిన మంత్రి

అయితే జగన్ ప్రెస్ మీట్ లో ఇలా మాట్లాడారో లేదో.. టీడీపీ ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ వేసింది. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మరో మాజీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డిలు ఏవిధంగా జగన్ కు బంధువులు అవుతారో తెలుపుతూ.. వంశ వృక్షాన్ని విడుదల చేసింది.

Advertisement

ఇక టీడీపీ ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన వంశ వృక్షం ఆధారంగా.. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మేనల్లుడి కుమారుడే టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డినని, మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి కుమార్తెను వైయస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడి కుమారుడికి ఇచ్చి వివాహం చేసినందుకు.. జగన్ కు భూమన మామ అవుతారని ఆ పోస్ట్ లో ఉన్న సారాంశం. అలాగే వైయస్ విజయమ్మ చెల్లెలిని వైవి సుబ్బారెడ్డి వివాహం చేసుకోవడంతో జగన్ కు బాబాయ్ అంటూ వారి చిత్రాలను సైతం అందులో పొందుపరిచింది.

అంతేకాకుండా.. టిటిడిలో అంతా మీ బంధువులను ఏర్పాటు చేసుకొని దోచుకున్నారు అంటూ.. మేము చెప్తుంటే, నీ భాగోతం బయట పెట్టిన, మా మీద పడి ఏడుస్తావా ? అంటూ మరో ట్వీట్ చేసింది టీడీపీ. ఇలా ట్వీట్ ల వర్షంతో మరోమారు టీడీపీ, వైసీపీ మధ్య వార్ ప్రారంభమైందని చెప్పవచ్చు.

ఇప్పటికే తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి కూటమి వర్సెస్ వైసీపీ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతుండగా.. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా నేరుగా జగన్ కే టీడీపీ గురి పెట్టిందని చెప్పవచ్చు. మొత్తం మీద టీడీపీ విడుదల చేసిన ఈ వంశవృక్షంలో వాస్తవం ఉందో లేదో కానీ.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీనిపై వైసీపీ ఎలా కౌంటర్ ఇస్తుందో వేచి చూడాలి.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×