E-Paper
Advertisement

Chandrababu: నేరాలు, ఘోరాలు చేయడంలో జగన్ పీహెచ్‌డీ చేశారు: చంద్రబాబు

Chandrababu: నేరాలు, ఘోరాలు చేయడంలో జగన్ పీహెచ్‌డీ చేశారు: చంద్రబాబు
Advertisement

Chandrababu: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన జగన్ చేతులెత్తేశారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. వైసీపీ మేనిఫెస్టోతో పోల్చితే.. టీడీపీ మేనిఫెస్టో సూపర్ సక్సెస్ అని తెలిపారు. కూటమి అధికారంలోకి రాగానే అంగన్వాడీలు, హోంగార్డులు, ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

సీఎం జగన్ గతంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా అంటూ నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ రూ.14 లక్షల కోట్లు అప్పు చేశారని వెల్లడించారు. గోదావరి పూర్తి చేస్తామని చెప్పి.. ఆ మాటలను గోదావరిలోనే కలిపేశారంటూ విమర్శించారు.

Advertisement

గులకరాయితో హత్యాయత్నం చేశారంటూ తనపై వైసీపీ నిందలు వేసిందని అన్నారు. గతంలో కూడా కోడి కత్తి కేసులోనూ ఇలాంటి తప్పుడు ఆరోపణలు తనపై చేశారని వెల్లడించారు. బ్యాండేజ్ తీయకుండా డ్రామాలు చేద్దామని జగన్ అనుకోగా.. ప్రజలు హేళన చేయడంతో ఇవాళ బ్యాండేజ్ తీశారని అన్నారు. అయితే జగన్ బ్యాండేజ్ తీసిన తర్వాత గాయం గుర్తులు ఎవరికైనా కనిపించాయా అంటూ ఎద్దేవా చేశారు.

అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తామన్న హమీ ఇప్పుడు ఏమైందన్నారు. రాష్ట్రంలో ఉత్తరకొరియా పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు ఇస్తామనే హామీ వైసీపీ మేనిఫెస్టోలో లేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రాగానే తొలి సంతకం డీఎస్సీపైనే చేస్తామని మరోసారి స్పష్టం చేశారు.

Advertisement

రాష్ట్రాన్ని టీడీపీ అభివృద్ధి భాటలో నడిపిస్తే.. వైసీపీ దాన్ని అరాచకంగా మారస్తోందని చంద్రబాబు విమర్శించారు. తమ పాలన స్వర్ణయుగం లాంటిదని.. అదే వైసీపీ పాలన రాతియుగంతో సమానమైనదని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ఈరోజు చేతులెత్తేశారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ మేనిఫెస్టోతో పోల్చితే.. టీడీపీ మేనిఫెస్టో సూపర్ సక్సెస్ అని అన్నారు.

Also Read: ‘ఆ ఒక్క మాటివ్వండి అన్నా’.. జగన్‌కు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

జగన్ నేరాలు, ఘోరాలు చేయడంలో పీహెచ్‌డీ చేశారని విమర్శించారు. వైసీపీ మేనిఫెస్టోలో రైతులకోసం ఒక్క హామీ కూడా ఇవ్వలేదన్నారు. జగన్ తన స్వార్థం కోసం మహిళల తాళిబొట్టు కూడా తెంపేసిన వ్యక్తి అని ఆరోపించారు. జగన్ నవరత్నాలు.. నవమోసాలు అయ్యాయని విమర్శించారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×