E-Paper
Advertisement

YS Sharmila: ‘ఆ ఒక్క మాటివ్వండి అన్నా’.. జగన్‌కు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

YS Sharmila: ‘ఆ ఒక్క మాటివ్వండి అన్నా’.. జగన్‌కు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ
Advertisement

YS Sharmila: వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని.. అందుకుగాను సీఎం జగన్ వారికి క్షమాపణలు చెప్పాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. జగన్ పాలనలో బడుగు బలహీనవర్గాల వారి జీవన ప్రమాణాలు అధ్వానంగా తయారయ్యాయని ఆరోపించారు.

సీఎం జగన్ కు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల బహిరంగ లేఖ రాశారు. జగన్ పాలనలో బడుగు బలహీన వర్గాలను పట్టించుకోలేదని.. అందువలన వారి జీవన ప్రమాణాలు అధ్వానంగా మారాయని వైఎస్ షర్మిల ఆరోపించారు. రాజ్యాంగం పరంగా వారికి దక్కాల్సిన హక్కులు కూడా దక్కడం లేదని విమర్శించారు.

Advertisement

వారికి కేటాయించాల్సిన నిధులను జగన్ దారి మళ్లించి బడ్జెట్ పరంగా ఉపప్రణాళికను మంటగలిపారని మండిపడ్డారు. వైసీపీ పాలన కారణంగా రాష్ట్రంలో ఐదేళ్లలో వారిపై అనేక దాడులు జరిగాయని వెల్లడించారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. అప్పటి వరకు కొనసాగిన 28 పథకాలను జగన్ నిలిపేశారంటూ వైఎస్ షర్మిల పేర్కొన్నారు. దళితులపై దాడులు జరుగుతున్నాసరే తనకేం పట్టనట్లే జగన్ ఉన్నారని విమర్శించారు. వారిపై దాడులు చేస్తున్న వారిని నిలువరించి.. వారిని కాపాడే ప్రయత్నాలు చేయడం లేదన్నారు.

Advertisement

బడుగు బలహీన వర్గాల వారిపై దాడులు చేస్తున్న వారిలో ఎక్కువ మంది వైసీపీకి చెందిన పెత్తందార్లే ఉన్నారని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఎస్సీలకు జగన్ ప్రభుత్వం మేలు చేయాల్సింది పోయి.. కీడు చేస్తోందంటూ దుయ్యబట్టారు.

Also Read: వైసీపీ పవిత్ర గ్రంథం, రెండు పేజీలు అవసరమా అంటూ..

ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జరిగిన అన్యాయానికి జగన్ క్షమాపణలు చెప్పాలంటూ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఇకపై ఏ వివక్షా లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మాటివ్వాలని కోరారు. బాధ్యత కలిగిన రాజకీయ పక్షంగా కాంగ్రెస్ తరఫున తమ డిమాండ్ అంటూ లేఖలో వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×