BigTV English
Advertisement

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? నిందితుల సమాధానాలకు పోలీసులకు చెమటలు పడుతున్నాయా? పోలీసుల ప్రశ్నలకు నిందితులకు ఉక్కపోస్తుందా? అదుర్స్ మూవీ తరహాలో డైలాగులు వినిపిస్తున్నాయా? నెక్ట్స్ ఏం చేయబోతున్నారు? ఇవే ప్రశ్నలు ఇప్పుడు నిందితులను వెంటాడుతున్నాయి.


ప్రొడ్యూసర్, వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెరకెక్కించిన మూవీ అదుర్స్. జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టింది. అందులో విలన్ వద్ద తెలీదు.. గుర్తు లేదు, మరిచిపోయానని జూనియర్ ఎన్టీఆర్ మూడు మాటలు మాత్రమే చెబుతున్నాడు. ఆ మూవీని వైసీపీ నేతలు ఎన్నిసార్లు చూశారో తెలీదుగానీ అవే సమాధానాలు చెబుతున్నారట.

అదేనండి.. టీడీపీ కార్యాలయంపై దాడి కేసును పోలీసుల విచారణ జరుగుతోంది. ఈ ఘటనలో మాజీ ఎంపీ నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ పాత్రపై మంగళగిరి పోలీసులు విచారణ చేస్తున్నారు.


డీటేల్స్ అన్నీ దగ్గర పెట్టుకుని పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు కేవలం మూడు మూడు ముక్కలు చెబుతున్నారు. తెలీదు.. గుర్తు లేదు.. మరిచిపోయాను చెప్పడంతో పోలీసులు షాకవుతున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు.

ALSO READ: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

ఈ కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు న్యాయస్థానం ఇచ్చిన రెండురోజుల పోలీసు కస్టడీ మంగళవారంతో ముగియనుంది. మరోసారి ఆయన్ని కస్టడీకి తీసుకోవాలని భావిస్తున్నారు. అంతకుముందు ఇదే కేసులో దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, రఘురాములను పోలీసులు విచారించారు. వాళ్లు కూడా ఇదే సమాధానాలు చెప్పారట.

ఫోన్ల గురించి అడిగితే తాము ఉపయోగించలేదని బదులు ఇచ్చారట. దాడి సంబంధించి విజువల్స్ చూపించి ఆ నేత ఎవరు అంటే తెలీదని చెబుతున్నారని సమాచారం. ఆయా నేతలు చెప్పిన వివరాలు సుప్రీంకోర్టుకు సమర్పించి వీరిని కస్టడీకి తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నారట మంగళగిరి పోలీసులు.

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×