E-Paper
Advertisement

TDP vs YCP : రప్పా రప్పా మళ్లీ మొదలెట్టిన వైసీపీ.. తగ్గేదెలే అన్న టీడీపీ!

TDP vs YCP : రప్పా రప్పా మళ్లీ మొదలెట్టిన వైసీపీ.. తగ్గేదెలే అన్న టీడీపీ!

ఏపీలో మరోసారి రప్పా రప్పా రాజకీయ స్లోగన్స్ మారుమోగాయి. అంతటితో ఆగకుండా జంతుబలులు కూడా చోటుచేసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరైతే సదరు బహిరంగంగా జంతుబలులు ఇస్తూ స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారో వారికి పోలీసులు తగిన గుణపాఠం చెప్పారు. 2029 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావాలని నినాదాలు చేస్తూ వచ్చాకే రప్పా రప్పే అంటే కొందరు వైసీపీ శ్రేణులు నినాదాలు చేసినట్లు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తున్నది. గతంలోనూ ఇలాగే జగన్ నిర్వహించిన ఓ బహిరంగ సభలో ఓ వైసీపీ అభిమాని పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్.. ‘ఈసారి రప్పా రప్పే..గొంతులు కొస్తాం’ అనే అర్ధం వచ్చేలా ఫ్లెక్సీలు ప్రదర్శించడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వైరల్ అయ్యింది.

జగన్ పుట్టిన రోజున జంతు బలులు..

మూడ్రోజుల కిందట వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పుట్టిన రోజు.. ఆరోజున కొందరు వైసీపీ శ్రేణులు అత్యుత్సాహానికి పాల్పడ్డారు. గోదావరి జిల్లాల్లో కొందరు వైఎస్ జగన్ ఫ్లెక్సీ బోర్డుల ఎదుట గొర్రె, మేకలను బహిరంగంగా బలి ఇచ్చారు. ఇది స్థానికంగా పలువురిని తీవ్ర భయాందోళనకు గురిచేసింది.వాటి రక్తంతో జగన్ ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేయడాన్ని పలువురు తీవ్రంగా ఆక్షేపించారు.ఇలాంటి సంప్రదాయం నేటి రాజకీయాలకు మంచిది కాదని, రక్తపాతాన్ని కోరుకుంటున్నారా? అని మరికొందరు విమర్శిస్తున్నారు.ఈ ఘటనపై ఏపీ హోంమంత్రి అనిత సైతం సీరియస్ అయ్యారు. జగన్ తన పార్టీ కార్యకర్తలకు ఇదేనా నేర్పించేది.. కంట్రోల్ చేయలేరా? అని మండిపడ్డారు.

తగిన గుణపాఠం చెప్పిన పోలీసులు..

జంతు బలులపై ఫిర్యాదు అందండంతో ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా ఈస్ట్ చోడవరం పోలీసులు రంగంలోకి దిగారు. జగన్ ఫ్లెక్సీ ఎదుట జంతు బలి చేసి ప్రజలను భ్రయభ్రాంతులకు గురిచేసిన ఏడుగురిని అరెస్టు చేశారరు. అనంతరం వారిని నడిరోడ్డుపై నడిపించుకుంటూ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితులను జ్యుడిషియల్ కస్టడీకి పంపనున్నట్లు పేర్కొన్నారు. ఇదిలాఉండగా పండుగలు, జాతర సమయంలో బలులు ఇస్తారని అందరికీ తెలుసు. వ్యక్తి పూజ పేరుతో జంతు బలులు ఇవ్వడం సమంజసం కాదని జంతు ప్రేమికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

తగ్గేదేలే అంటున్న టీడీపీ..

వైసీపీ అధికారంలోకి వస్తుందని, జగన్ మళ్లీ సీఎం అవుతారని కలలు కంటున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు ఎద్దేవాచేశారు. జగన్ అధికారంలోకి రావడం కలే అని విమర్శించారు.ఆయన అధికారంలోకి వస్తే మరసారి రౌడీ రాజకీయాలు చేద్దామని వైసీపీ శ్రేణులు అనుకుంటున్నారని.. తమ నేతల మనోధైర్యం దెబ్బతినేలా పదేపదే రప్పా రప్పా నినాదాలు చేస్తున్నారని.. గతంలో నడిచింది కానీ ఈసారి వారి పప్పులు ఉడకవని.. ఎందుకంటే అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వమని తెలుగుదేశం పార్టీ నాయకులు గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు.మరోవైపు జంతు బలుల సంప్రదాయాన్ని మొదలెట్టిందే టీడీపీ అని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. జగన్ ఇప్పటికైనా తమ కేడర్, నేతలను తప్పులు చేయకుండా నియంత్రించాలని లేదంటే చట్టం తన పని చేసుకుంటూ పోతుందని తెలుగు తమ్ముళ్లు పరోక్షంగా హెచ్చరికలు చేస్తున్నారు.

 

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×