E-Paper
Advertisement

TTD News: టీటీడీ సీరియస్.. వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక

TTD News: టీటీడీ సీరియస్.. వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
Advertisement

TTD News: తిరుమల తిరుపతి దేవస్థానం సీరియస్ గా కీలక ప్రకటన జారీ చేసింది. ఎవరైనా ఇలాంటి చర్యలకు మున్ముందు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లే విధంగా ఎవరు ప్రవర్తించినా సహించే ప్రసక్తి లేదని, ఇటువంటి చర్యలకు పాల్పడేవారు తస్మాత్ జాగ్రత్త అంటూ టీటీడీ అధికారిక ప్రకటన విడుదల చేయడం విశేషం.

అసలేం జరిగిందంటే..
తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రజా సంబంధాల అధికారినిగా నిష్కా బేగం పని చేసినట్లు, ఇంటిపై ఈడీ దాడులు చేసిందని, అక్కడ తిరుమల కు సంబంధించిన నగలను స్వాధీనం చేసుకున్నట్లు సామాజిక మాధ్యమాలలో పలు ఫోటోలు వైరల్ గా మారాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రజా సంబంధాల అధికారినిగా పనిచేసిన నిష్కా బేగంకు సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ కావడంతో టీటీడీ స్పందించింది.

Advertisement

తిరుమల తిరుపతి దేవస్థానంలో అటువంటి వ్యక్తి ప్రజా సంబంధాల అధికారిగా అసలు పని చేయలేదని, అంతేకాకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులో గతంలో ఎక్కడో జరిగిన ఫోటోలను జతపరిచి తిరుమల తిరుపతి దేవస్థానం పేరును ఉపయోగించడం పై టీటీడీ సీరియస్ గా ఖండించింది. వైరల్ గా మారిన పోస్టులో గల అధికారి ఎప్పుడు టీటీడీలో పనిచేయలేదని, ఇటువంటి వాటిని ప్రచారం చేయడం తగదంటూ టీటీడీ సూచించింది.

Also Read: AP Intermediate Exams: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ పరీక్షలు ఇక లేవట!

Advertisement

తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లేలా ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు సైతం జారీ చేసింది. అవాస్తవ వార్తలు ప్రచారం చేయడం తో భక్తులను తప్పుదోవ పట్టించినట్లుగా ఉంటుందని, అంతేకాకుండా భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇటువంటి చర్యలకు పాల్పడడం తగదని మరో మారు టీటీడీ సూచించింది. తిరుమల తిరుపతి దేవస్థానం కు సంబంధించి ఏ విషయమైనా పూర్తిగా నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందని, కోట్ల మంది భక్తుల మనోభావాలను గౌరవించి ఇటువంటి వాటిని ప్రచారం చేయడం తగదంటూ టీటీడీ ప్రకటించింది.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×