E-Paper
Advertisement

TTD News: టీటీడీ సీరియస్.. వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక

TTD News: టీటీడీ సీరియస్.. వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
Advertisement

TTD News: తిరుమల తిరుపతి దేవస్థానం సీరియస్ గా కీలక ప్రకటన జారీ చేసింది. ఎవరైనా ఇలాంటి చర్యలకు మున్ముందు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లే విధంగా ఎవరు ప్రవర్తించినా సహించే ప్రసక్తి లేదని, ఇటువంటి చర్యలకు పాల్పడేవారు తస్మాత్ జాగ్రత్త అంటూ టీటీడీ అధికారిక ప్రకటన విడుదల చేయడం విశేషం.

అసలేం జరిగిందంటే..
తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రజా సంబంధాల అధికారినిగా నిష్కా బేగం పని చేసినట్లు, ఇంటిపై ఈడీ దాడులు చేసిందని, అక్కడ తిరుమల కు సంబంధించిన నగలను స్వాధీనం చేసుకున్నట్లు సామాజిక మాధ్యమాలలో పలు ఫోటోలు వైరల్ గా మారాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రజా సంబంధాల అధికారినిగా పనిచేసిన నిష్కా బేగంకు సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ కావడంతో టీటీడీ స్పందించింది.

Advertisement

తిరుమల తిరుపతి దేవస్థానంలో అటువంటి వ్యక్తి ప్రజా సంబంధాల అధికారిగా అసలు పని చేయలేదని, అంతేకాకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులో గతంలో ఎక్కడో జరిగిన ఫోటోలను జతపరిచి తిరుమల తిరుపతి దేవస్థానం పేరును ఉపయోగించడం పై టీటీడీ సీరియస్ గా ఖండించింది. వైరల్ గా మారిన పోస్టులో గల అధికారి ఎప్పుడు టీటీడీలో పనిచేయలేదని, ఇటువంటి వాటిని ప్రచారం చేయడం తగదంటూ టీటీడీ సూచించింది.

Also Read: AP Intermediate Exams: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ పరీక్షలు ఇక లేవట!

Advertisement

తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లేలా ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు సైతం జారీ చేసింది. అవాస్తవ వార్తలు ప్రచారం చేయడం తో భక్తులను తప్పుదోవ పట్టించినట్లుగా ఉంటుందని, అంతేకాకుండా భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇటువంటి చర్యలకు పాల్పడడం తగదని మరో మారు టీటీడీ సూచించింది. తిరుమల తిరుపతి దేవస్థానం కు సంబంధించి ఏ విషయమైనా పూర్తిగా నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందని, కోట్ల మంది భక్తుల మనోభావాలను గౌరవించి ఇటువంటి వాటిని ప్రచారం చేయడం తగదంటూ టీటీడీ ప్రకటించింది.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×