E-Paper
Advertisement

Rajya Sabha: ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ముగ్గురు ప్రమాణస్వీకారం

Rajya Sabha: ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ముగ్గురు ప్రమాణస్వీకారం
Advertisement

Rajya Sabha: ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ముగ్గురు ప్రమాణస్వీకారం చేశారు. టీడీపీ నుంచి బీదా మస్తాన్ రావు, సానా సతీష్ ప్రమాణం చేయగా.. బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యా ప్రమాణస్వీకారం చేశారు. ఛైర్మన్ జగదీప్ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తొలిసారిగా రాజ్యసభ్యునిగా.. టీడీపీ నుంచి సానా సతీష్ సభలో అడుగుపెట్టారు.

కొద్ది రోజుల క్రితం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీకి బలం లేకపోవడంతో.. మూడు రాజ్యసభ స్థానాలు కూటమికే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నిక సంఘం ఇటీవల ప్రకటించింది. ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్ధులు ఖరారు చేశారు. ఈ క్రమంలోనే టీడీపీ నుంచి సానా సతీష్, బీద మస్తాన్ రావును ఎంపిక చేయగా.. బీజేపీ ఆర్‌.కృష్ణయ్యకు ఛాన్స్ ఇచ్చింది. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నికలు వచ్చాయి. కానీ పార్టీ మారిన తర్వాత కూడా ఆర్‌.కృష్ణయ్య, బీద మస్తాన్ రావుకు మళ్లీ అవకాశం దక్కడం హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

వ్యాపారవేత్తగా పేరు గాంచిన బీద మస్తాన్ రావు.. 2009లో కావలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత రెండు పర్యాయాలు ఓటమి పాలయ్యారు‌. అయితే క్రియాశీలక రాజకీయాలలో లేని బీద మస్తాన్ రావును 2022లో వైసీపీ రాజ్యసభకు పంపించింది. కానీ ఈ ఏడాది జరిగిన జనరల్ ఎలక్షన్ సమయానికి.. వైసీపీకి, రాజ్యసభకు కూడా బీద మస్తాన్ రావు రాజీనామా చేసారు. టీడీపీ నుంచి బలమైన ప్రామిస్ ఇవ్వడంతోనే.. సైకిల్ గూటికి చేరి మళ్లీ సీటు దక్కించుకున్నారని సమాచారం. అలానే ఇప్పటికే కాకనాడ ఎంపీ స్థానాన్ని ఆశించి వదులుకున్న సానా సతీష్‌కు కూడా రాజ్యసభ స్థానాన్ని టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసింది.

Also Read: గింజుకుంటున్న వైసీపీ, అధినేత వద్ద నేతల మొర.. ఆ విధంగా ముందుకెళ్దామా?

Advertisement

మొదటి నుంచి బీసీ నాయకుడిగా గుర్తింపు పొందారు ఆర్.కృష్ణయ్య. 2014లో టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఇక గత వైసీపీ ప్రభుత్వం ఆర్.కృష్ణయ్యను రాజ్యసభకు పంపించింది. రీసెంట్ గానే ఆయన రాజ్యసభకు, వైసీపీకి రాజీనామా చేశారు. అయితే బీసీ ఉద్యమ నాయకుడు కావడం.. బీజేపీకి బీసీలలో కచ్చితంగా ఓటు బ్యాంకు పెంచుకోవాల్సిన అవసరం ఉండటంతో ఆర్.కృష్ణయ్యను దగ్గర చేసుకున్నారని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సామాజికవర్గ సమీకరణాలతో ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ ఇచ్చి బీజేపీ కండువా కప్పినట్లు తెలుస్తోంది.

 

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×