BigTV English

Kanchikacharla quarry: ఎన్టీఆర్ జిల్లాలో దారుణం, క్వారీలో బండరాళ్లు పడి ముగ్గురు మృతి

Kanchikacharla quarry: ఎన్టీఆర్ జిల్లాలో దారుణం, క్వారీలో బండరాళ్లు పడి ముగ్గురు మృతి

Kanchikacharla quarry: ఉమ్మడి కృష్ణాజిల్లాలో దారుణం జరిగింది. కంచికచర్ల మండలం పరిటాల క్వారీలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. క్వారీ పైనుంచి లూజు బోల్డర్స్ జారీ డ్రిల్లింగ్ చేస్తున్నవారిపై బండరాళ్లు పడ్డాయి. స్పాట్‌లో ముగ్గురు మృతి చెందారు.


పరిటాల క్వారీపై కార్మికులు డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో పైనుంచి బండరాళ్లు కిందపడ్డాయి. పెద్ద  రాయి కింద పడి ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. ప్రస్తుతం అక్కడ వర్షం పడడంతో సహాయకచర్యలకు అంతరాయం ఏర్పడింది.

మృతులు జి కొండూరు మండలం చెరువు మాధవరం వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. అధికారులు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. మొత్తం క్వారీ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు రావాల్సివుంది.


 

Tags

Related News

Smart Ration cards: ఏపీలో ప్రారంభమైన స్మార్ట్‌ రేషన్ కార్డుల పంపిణీ

Jagan Tour: జగన్ తిరుమల పర్యటన.. మళ్లీ డిక్లరేషన్ లొల్లి, నో అంటున్న వైసీపీ

AP DSC verification: ఏపీ డీఎస్సీ వెరిఫికేషన్‌ వాయిదా.. రాత్రి ప్రకటన వెనుక

AP New Scheme: సీఎం చంద్రబాబు కొత్త స్కీమ్.. కోటి వరకు, వారంతా ఆనందంలో

CM Progress Report: 51వ CRDA సమావేశం.. అమరావతి డెవలప్‌మెంట్‌కు ఎన్ని కోట్లు అంటే..!

AP rains alert: మోస్తారు నుండి భారీ వర్షాలు.. రాబోయే 3 రోజులు జాగ్రత్త తప్పనిసరి!

Big Stories

×