E-Paper
Advertisement

Tirumala prasadam rules: తిరుమల ప్రసాదం తయారీకి ఇన్ని నియమాలు పాటిస్తారా? పొయ్యి నుంచి నెయ్యి వరకు.. అద్భుతః!

Tirumala prasadam rules: తిరుమల ప్రసాదం తయారీకి ఇన్ని నియమాలు పాటిస్తారా? పొయ్యి నుంచి నెయ్యి వరకు.. అద్భుతః!
Advertisement

Tirumala prasadam rules: తిరుమల ఈ పేరు వినగానే భక్తి హృదయాన్ని అలుముకుంటుంది. ఏటా కోట్లాది మంది భక్తులు గిరిశిఖరాలనదాటి, కాలినడకనో, వాహనాల ద్వారానో, కాన్వాయ్‌లలోనో స్వామివారి సన్నిధిని చేరతారు. ఎందుకంటే తిరుమల కేవలం దేవస్థానం కాదు.. అది భక్తికి మకుటమైన క్షేత్రం, అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి కేంద్రం. ఇక్కడ కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తుల విశ్వాసంలో స్థిరమై ఉన్నారు.

శ్రీవారి ప్రసాదం విశిష్టత..
తిరుమల పర్వతాన్ని శేషాద్రి అని పిలుస్తారు. విష్ణువుని శేషవాహనుడు అయిన ఆదిశేషుడే ఈ గిరిపర్వతంగా అవతరించాడన్నది పురాణోక్తం. అటువంటి పవిత్ర ప్రాంతంలో ప్రతి క్షణం దేవసన్నిధి, ప్రతి ప్రక్రియ వైదికతతో నిండినదే. ఇందులో ముఖ్యమైనదే శ్రీవారికి నివేదించే ప్రసాదం.

Advertisement

ప్రతి పదార్థం పవిత్రం..
శ్రీవారి ప్రసాదం అనేది కేవలం ఆహారం కాదు.. అది భక్తితో తయారయ్యే ఆరాధన రూపం. ప్రసాదాల తయారీకి ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. వంట చెరకుగా మామిడి, ఆశ్వత్థ, పలాస వృక్షాల ఎండు కొమ్మలనే వాడాలి. ఇవి నీటిని తక్కువగా గ్రహించే వృక్షాలు కావడంతో ప్రకృతి సమతుల్యతకు తోడ్పడతాయి.

వంట చెరకు ఎంపిక ఇలా..
వంట చెరకు ఎంపికలోనే తాత్త్వికత దర్శనమిస్తుంది. పాలిచే చెట్లు, ముండ్ల చెట్లు వాడకూడదు. వంటకారులకు హాని కలుగకుండా ఉండాలన్న నిబంధన ఇది. అలాగే, వంట పాత్రలు బంగారం, వెండి, రాగి, ఇత్తడి లేదా మట్టితో తయారై ఉండాలి. మట్టికుండలను ఎక్కువకాలం వాడరాదు. ఇవన్నీ ఆరోగ్య పరిరక్షణ కోణంలోనూ అద్భుతమైన సూచనలే.

Advertisement

ప్రసాదం తయారీకి ఇలా సిద్ధం అవుతారు
వంట చేసే వారు వాసన చూడరాదు. వారు ముక్కుకూ, నోటికీ గుడ్డ కట్టుకుంటారు. ఇది నేటి మాస్క్ కు మాదిరిగా, భక్తుల ఆరోగ్యాన్ని కాపాడే ప్రాథమిక చర్య. శ్రీవారికి సమర్పించే అన్నం పరిమితి కూడా ఉండాలి. మిగిలిన అన్నం, మాడినది, చెమట పడినది, వెంట్రుకలు పడ్డది వంటి అన్నాన్ని నివేదించరాదు.

ప్రసాదాల తయారీకి ముందు, ప్రతి పాత్రలో ఆవునెయ్యి పోసి, తులసిదళం ఉంచి, అష్టాక్షరీ మంత్రం ఓం నమో నారాయణాయను ఉచ్ఛరిస్తారు. ఇది భక్తికి శుద్ధతను జతచేసే పద్ధతి. శ్రీవారికి ప్రతిరోజూ మూడు పూటలా నైవేద్యం సమర్పించబడుతుంది. అవేమిటంటే.. ఉదయం బాలభోగం, మధ్యాహ్నం రాజభోగం, రాత్రి శయనభోగం.

Also Read: India Zambia minerals: తెగ త్రవ్వేస్తున్న భారత శాస్త్రవేత్తలు.. ఆ సంపద విలువ కోట్లలోనే!

బాలభోగంలో మాత్రం మాత్రాన్నం అనే ప్రత్యేక ప్రసాదాన్ని గర్భాలయం లోపలే నివేదిస్తారు. ఇది భక్త భీమన్నను గుర్తుచేసే స్మారక నైవేద్యం. ఈ వంటకం పెరుగన్నం, శొంఠి, వెన్న, ఉప్పుతో తయారవుతుంది. మట్టికుండలోనే ఇది సమర్పించబడుతుంది. అందుకే దీన్ని ఓడు ప్రసాదం అంటారు.
ప్రసాదాలను ఉపయోగించే పదార్థాల ఆధారంగా నాలుగు ప్రధాన రకాలుగా విభజిస్తారు. అన్నప్రసాదాలు (పులిహోర, పెరుగన్నం, మిరియాల అన్నం), తీపి పదార్థాలు (లడ్డూ, జిలేబి, పాయసం), ఉప్పు వంటలు (వడ, దోశ, సుండలు), అపక్వ ప్రసాదాలు (పంచకజ్జాయం, బెల్లం పానకం, మధురఫలాలు).

నైవేద్యం సమయంలో..
తిరుమలలో నైవేద్యం సమయంలో పెద్దగంటలు మ్రోగిస్తారు. ఇది భక్తులకు సూచనగా ఉంటుంది. అనేక మంది భక్తులు ఈ గంట ధ్వని విన్న తర్వాతే భోజనం ప్రారంభిస్తారు. ఇది భక్తి, ఆచారాన్ని మిళితం చేసిన నిబంధన.

రాత్రి నైవేద్య అనంతరం స్వామివారికి శయనానికి ముందు మేవాలు, పాలతోపాటు చివరి నివేదన చేస్తారు. అర్థరాత్రి జరిగే తిరువీశం సమయంలో మాత్రమే చిన్న గంట మ్రోగుతుంది.. ఎందుకంటే స్వామివారికే ఈ నివేదన ప్రత్యేకంగా.

తిరుమలలో ప్రతిరోజూ జరిగే ఈ ప్రసాద నిర్వాహణ క్రమం వెనుక.. భక్తుల ఆరోగ్యం, ఆధ్యాత్మిక శుద్ధత, ప్రకృతి పరిరక్షణ, వైదిక సంస్కృతి అన్నీ సంకలితమై ఉన్నాయి. భక్తులకు అందించే ఈ ప్రసాదం.. స్వామివారి ఆశీస్సులతో పాటు శాస్త్రానుగత, ఆరోగ్యానుకూల ఆహారం కావడమే దీనికి మరింత విశిష్టతను కలిగిస్తుంది.

ఇదే తిరుమల ప్రత్యేకత.. భక్తికి మించిన భద్రత, భోజనానికి మించిన బోధ, అన్నప్రసాదానికి మించిన ఆనందం. శ్రీవారికి నివేదించే ప్రతి పవిత్ర వంటకం వెనుక ఉన్నది భక్తిని ప్రతిబింబించే కథనం, శుద్ధతను చెబుతున్న సందేశం.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×