Kakinada: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అన్నవరం నుండి జగ్గంపేట వస్తున్న ఓ పెళ్లి కారు.. కిర్లంపూడి మండలం సోమవారం గ్రామం జంక్షన్ దగ్గర కారు ఫ్రెంట్ టైర్ ఒక్కసారిగా పేలడంతో అదుపు తప్పి ఓ బైక్ను, రిక్షాను ఢీ కొట్టింది. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న బస్టాప లోకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరి కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల ఫిర్యాదుతో ఘనటాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టి మృతులను పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. తీవ్ర గాయాలతో రక్తపుమడుగులో ఉన్నవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.