E-Paper
Advertisement

Jagan Vs YV Subbareddy: సాయిరెడ్డి బాటలో సుబ్బారెడ్డి, జగన్‌తో వైవీకి ఎక్కడ చెడింది?

Jagan Vs YV Subbareddy: సాయిరెడ్డి బాటలో సుబ్బారెడ్డి, జగన్‌తో వైవీకి ఎక్కడ చెడింది?

Jagan Vs YV Subbareddy: తిరుమల లడ్డూ వ్యవహారం వైసీపీని ఉక్కిరి బిక్కరి చేస్తోందా? ఈ విషయంలో నేతలు రెండుగా చీలిపోయారా? జగన్ మాటలు ఒకలా.. బాబాయి సుబ్బారెడ్డి మాటలు మరొకలా ఉన్నాయా? ఈ విషయంలో బాబాయి-అబ్బాయి మధ్య చెడిందా? పీపీపీ మాదిరిగా ఏపీలో ఒక మాట.. హస్తినలో మరొక మాట మాట్లాడుతున్నారా? అవుననే అంటున్నారు రాజకీయ నేతలు.

జగన్‌తో వైవీ సుబ్బారెడ్డికి ఎక్కడ చెడింది?

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం వైసీపీలో విభేదాలు మొదలైనట్టు తెలుస్తోంది. సీబీఐ సిట్ ఇచ్చిన నివేదికలో నెయ్యి కల్తీ జరిగిందని క్లియర్‌గా తేల్చింది. కెమికల్స్‌తో ఉపయోగించిన నెయ్యిని వినియోగించినట్టు పేర్కొంది. జంతువుల కొవ్వు లేదని అందులో ప్రస్తావించింది. ఈ విషయాన్ని పట్టుకుని మాజీ సీఎం జగన్, తిరుమల లడ్డూ విషయంలో ఎలాంటి కల్తీ జరగలేదని ప్రచారం మొదలుపెట్టారు.

దీనిపై తెలుగు మీడియాతో ఒకలా.. జాతీయ మీడియాతో ఒకలా ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. ఈ వ్యవహారంపై అంబటి రాంబాబు కుటుంబసభ్యులను పరామర్శించిన క్రమంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు అవాస్తవమని సీబీఐ సిట్ తేల్చిందన్నారు. ఏ తప్పూ చేయలేదు కాబట్టే సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని వ్యాఖ్యానించారు.

సాయిరెడ్డి బాటలో సుబ్బారెడ్డి?

ఈ వ్యవహారంపై నేషనల్ మీడియాతో మాట్లాడారు టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి.  సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చిందంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి. తిరుమల లడ్డూ కల్తీ జరిగినట్టు అంగీకరించారు టీటీడీ మాజీ ఛైర్మన్. సీబీఐ సిట్ ఛార్జీషీటులో అదే మెన్షన్ చేసిందన్నారు.

నెయ్యిని సప్లై చేసినవారు అందులో ఉన్నారని చెప్పారు. ముఖ్యంగా అధికారులు, థర్డ్ పర్సన్స్, అందరి పేర్లు ప్రస్తావించిందన్నారు. ఈ వ్యవహారంలో జగన్ ఒకలా.. బాబాయి మరొకలా మాట్లాడడంపై ఆ పార్టీ నేతలు షాకయ్యారు. అబ్బాయి-బాబాయి ఎక్కడో చెడిందని చర్చించుకుంటున్నారు. జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తున్న కొందరు రాజకీయ నేతలు.. సాయిరెడ్డి మాదిరిగా వైవీని దూరం పెట్టే అవకాశముందని అంటున్నారు.

ALSO READ: జగన్‌ని డ్యామేజ్ చేస్తున్న కేడర్.. ఈసారి కొత్తగా ఆ రెండు

మెడికల్ కాలేజీ విషయంలోనూ వైసీపీ ఇలాంటి డ్రామాలే ఆడిందని అనుకుంటున్నారు. దీనిపై జాతీయస్థాయిలో మద్దతు ఇచ్చిన వైసీపీ, ఏపీకి వచ్చేసరికి తీవ్రంగా వ్యతిరేకిందని గుర్తు చేస్తున్నారు. ఈ లెక్కన జగన్ డబుల్ గేమ్ ఆడుతున్నారని అంటున్నారు. ఇలా రెండు పడవలపై కాలు పెడితే మొదటికి ముప్పు వస్తుందని అంటున్నారు. మొత్తానికి మెడికల్ కాలేజీ నిర్మాణాల విషయంలో పీపీపీల మాదిరిగానే, కల్తీ నెయ్యి విషయంలో వైసీపీ ఇరుక్కుపోయింది.

 

 

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×