BigTV English
Advertisement

Tirumala Update: తిరుపతి తొక్కిసలాట ఘటనలో నలుగురు భక్తులు మృతి.. అసలేం జరిగిందంటే?

Tirumala Update: తిరుపతి తొక్కిసలాట ఘటనలో నలుగురు భక్తులు మృతి.. అసలేం జరిగిందంటే?

Tirumala Update: తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో పలుచోట్ల టికెట్ల కేంద్రాలను ఏర్పాటు చేయగా, తొక్కిసలాట జరిగి అపశృతి చోటుచేసుకుంది. తిరుపతిలోని శ్రీనివాసం వద్ద వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. సుమారు 11 పైగా టికెట్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, శ్రీనివాసం వద్దకు బుధవారం సాయంత్రం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఒక్కసారిగా టికెట్ కౌంటర్ వద్దకు భక్తులను అనుమతించడంతో తొక్కిసలాట జరిగినట్లు స్థానికులు తెలుపుతున్నారు.


తొక్కిసలాటలో చాలా వరకు భక్తులు అపస్మారక స్థితికి వెళ్లగా వారిని హుటాహుటిన టీటీడీ సిబ్బంది రుయా వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం నలుగురు భక్తులు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. ఘటన జరిగిన వెంటనే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరు గురించి ఆరా తీస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలవకుండా అన్ని చర్యలు చేపట్టినప్పటికీ అపశృతి చోటు చేసుకోవడంతో టీటీడీ అధికారులు విస్మయానికి గురయ్యారు. అయితే మృతుల సంఖ్య పై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం వచ్చిన నలుగురు భక్తులు తోపులాటలో మృతి చెందడంతో సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టోకెన్ల కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చిన సందర్భంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచి వేసిందని సీఎం అన్నారు. ఈ ఘటనలో గాయాలైన వారికి వెంటనే మెరుగైన వైద్య చికిత్స అందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. కాగా మరికొంత మంది భక్తులు అనారోగ్యపాలైనట్లు తెలుస్తోంది.


భక్తులు మృతి చెందడం బాధాకరం.. వైఎస్ జగన్

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వైకుంఠ దర్శనంకోసం తిరుపతిలో టోకెన్లు జారీచేస్తున్న కేంద్రం వద్ద తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌.జగన్మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమన్నారు. తక్షణం అక్కడ పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు కోలుకోవాలని ఆకాంక్షించారు.

టీటీడీ పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి.. లోకేష్

వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల విడుదల నేపథ్యంలో తిరుపతిలోని విష్ణు నివాసం దగ్గర జరిగిన తొక్కిసలాటలో నలుగురు భక్తులు మృతి చెందడం తనను  తీవ్ర మనోవేదనకు గురిచేసిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇటువంటి అవాంచనీయ ఘటనలకు తావీయకుండా టీటీడీ మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. మృతి చెందిన భక్తుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని లోకేష్ హామీ ఇచ్చారు.

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×