E-Paper
Advertisement

Tirumala News: తిరుమలలో విషాదం.. తొక్కిసలాటలో భక్తురాలి మృతి..

Tirumala News: తిరుమలలో విషాదం.. తొక్కిసలాటలో భక్తురాలి మృతి..
Advertisement

Tirumala News: తిరుపతిలో  విషాదం చోటుచేసుకుంది. ఈనెల 10న వైకుంఠ ఏకాదశి ని పురస్కరించుకొని టీటీడీ సిబ్బంది వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు ఇస్తోంది.  ఈ నెల 10 నుంచి 12 వరకు గాను టోకెన్ల ప్రక్రియ ప్రారంభించింది. అయితే దర్శన టోకెన్ల కోసం పెద్ద ఎత్తున భక్తులు టీటీడీ కేటాయించిన కేంద్రాల వద్దకు పోటెత్తారు. ఈ క్రమంలో తిరుపతి బస్టాండ్ సమీపంలోని విష్ణు నివాసం వద్ద తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో మల్లిక అనే మహిళ మృతి చెందింది. మరో ఆరుగురి భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

తోపులాటలో మల్లిక తొలుత తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే అక్కడి టీటీడీ సిబ్బంది స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.  అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలిని తమిళనాడుకు చెందిన మల్లికగా పోలీసులు గుర్తించారు.  గాయాల పాలైన ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు తిరుపతిలోనే ఏర్పాటు చేసిన బైరాగి పట్టెడలోని రామానాయుడు పాఠశాల వద్ద కూడా తొక్కిసలాట చోటుచేసుకుంది.

Advertisement

Also Read: IITGN Jobs: బీటెక్ పాసైన వారికి శుభవార్త.. ఈ ఉద్యోగం కొడితే నెలకు RS.2,00,000 పైనే..

మరోవైపు టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనం ఉంటుందని ఇదివరకే టీటీడీ చెప్పిన విషయం తెలిసిందే. ఈనెల 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్న విషయం తెలిసిందే.  తిరుమలలో మొత్తం మూడు ప్రాంతాల్లో తొక్కిసలాట జరిగింది. తోపులాట గాయపడిన భక్తులను రుయా ఆస్పత్రికి తరలించారు. దీనిపై మరింత సమాాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

 

 

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×